Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చందమామపై మనసుపడిన ''మన్మథుడు"

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (15:31 IST)
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌పై టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున మనసుపడ్డారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కథానాయికగా కాజల్ పేరును ఖరారు చేశారు. 
 
ఈ విషయాన్ని గురువారం చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తమ టీమ్‌లోకి కాజల్‌ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. త్వరలోనే కాజల్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతుంది.
 
ఇదిలావుంటే, సాధారణంగా పెళ్లయితే కనుక కథానాయికలకు చాలావరకు అవకాశాలు సన్నగిల్లిపోతాయి. కానీ, ఇటీవలి కాలంలో మాత్రం కొందరి విషయంలో ఇది తప్పని రుజువవుతోంది. పెళ్లయినా కూడా సమంత ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా వుంది. 
 
మరోపక్క, తాజాగా పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్‌కు కూడా అవకాశాలు వస్తూనే వున్నాయి. ఇప్పటికే చిరంజీవి సరసన 'ఆచార్య'లోను, హిందీలో 'ముంబై సాగా' సినిమాలోనూ నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా నాగార్జున సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకోవడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments