Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చందమామపై మనసుపడిన ''మన్మథుడు"

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (15:31 IST)
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌పై టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున మనసుపడ్డారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కథానాయికగా కాజల్ పేరును ఖరారు చేశారు. 
 
ఈ విషయాన్ని గురువారం చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తమ టీమ్‌లోకి కాజల్‌ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. త్వరలోనే కాజల్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతుంది.
 
ఇదిలావుంటే, సాధారణంగా పెళ్లయితే కనుక కథానాయికలకు చాలావరకు అవకాశాలు సన్నగిల్లిపోతాయి. కానీ, ఇటీవలి కాలంలో మాత్రం కొందరి విషయంలో ఇది తప్పని రుజువవుతోంది. పెళ్లయినా కూడా సమంత ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా వుంది. 
 
మరోపక్క, తాజాగా పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్‌కు కూడా అవకాశాలు వస్తూనే వున్నాయి. ఇప్పటికే చిరంజీవి సరసన 'ఆచార్య'లోను, హిందీలో 'ముంబై సాగా' సినిమాలోనూ నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా నాగార్జున సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకోవడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments