Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"బీరువా" సురభికి మరో ఛాన్స్...

, ఆదివారం, 14 మార్చి 2021 (11:27 IST)
'బీరువా' అనే చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన నటి సురభి. ఈ చిత్రంలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. 2013లో ఓ తమిళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కోలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్‌కు 'బీరువా' అనే చిత్రం ద్వారా పరిచయమైంది. సురభికి మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది. 
 
టాలీవుడ్‌లో దర్శక, నిర్మాతలను బాగానే ఆకట్టుకుంది. దాంతో ఇక్కడ 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'ఎటాక్', 'జెంటిల్‌మాన్' వంటి సినిమాలు చేసి ఆకట్టుకుంది. ప్రేక్షకుల్లో కూడా సురభికి మంచి గుర్తింపు దక్కింది. కానీ వరసగా అవకాశాలు మాత్రం దక్కించుకోవడంలో బాగా వెనకబడింది. 2019లో 'ఓటర్ అన్న' సినిమా తర్వాత రీసెంట్‌గా 'శశి' అన్న సినిమాలో నటించింది.
 
ఈనెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆది సాయికుమార్ హీరోగా నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. సురభి కూడా ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటుందని చెప్పుకుంటున్నారు. 
 
'శశి' సినిమాలో ఉన్న 'ఒకే ఒక లోకం నువ్వే' సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మళ్ళీ అందరి దృష్టి సురభి మీద పడిందని తెలుస్తోంది. ఈ సినిమా మీద సురభి చాలా నమ్మకాలు పెట్టుకోగా హిట్ టాక్ వస్తే మాత్రం మళ్ళీ యంగ్ హీరోల సినిమాలలో వరసగా అవకాశాలు దక్కించుకుంటుందని నమ్మకంగా ఉందట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అర్జున్ రెడ్డి'తో విజయ్ దేవరకొండ.. జాతిరత్నాలుతో నవీన్ పోలిశెట్టి!!