'వకీల్ సాబ్‌'కు ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్ వేసిన పోలీసులు!

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (10:24 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'వకీల్ సాబ్'. ముగ్గురు హీరోయిన్లు నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించగా, ఏప్రిల్ 9వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. అయితే, దీనికింటే ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ ఈవెంట్ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.
 
కాగా, వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3న నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికి అనుమతి కోరుతూ జె.మీడియా పోలీసులకు లేఖ రాసింది. ఈ ఫంక్షన్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని ఆ లేఖలో నిర్వాహకులు పేర్కొన్నారు.
 
అయితే, రాష్ట్రంలో కరోనా మళ్లీ చెలరేగుతున్న నేపథ్యంలో సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పవన్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

కాళేశ్వరంలో అవినీతి.. హరీష్ రావు ప్రమేయం వల్లే కేసీఆర్‌కు చెడ్డ పేరు.. కల్వకుంట్ల కవిత

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments