యుక్త వయసులోనే ఆ ఛాన్స్ వచ్చింది.. కానీ... : "వైల్డ్ డాగ్" నటి దియా మిర్జా

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (09:30 IST)
హైదరాబాద్‌లో పుట్టి బాలీవుడ్‌లో రాణిస్తున్న హీరోయిన్ దియా మిర్జా. బీటౌన్‏లో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అక్కినేని నాగార్జున సరసన "వైల్డ్ డాగ్" సినిమాలో నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర ప్రమోషన్స్‏ను చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టుంది. 
 
ఈ సందర్భంగా దియా మిర్జా మాట్లాడుతూ, తనకు యుక్త వయసులోనే తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. కానీ.. ఆ సమయంలో నా నటనపై నాకే అనుమానం వచ్చింది. దీంతో సినిమాలకు నో చెప్పేదాన్ని. కానీ ఇన్నేళ్ళకు తెలుగులో నటించే అవకాశం వచ్చింది. 
 
ఈ సినిమా తర్వాత తెలుగులో నాకు మరిన్ని అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను. నాకు ఇష్టమైన నటులు నాగార్జున, వెంకటేష్‏లతో నటించడం ఆనందంగా ఉంది. ఇప్పటికి నా కల సగం నెరవేరినట్టుగా ఉంది. కానీ మరో సగం కల నెరవేరాల్సి ఉంది అంటూ చెప్పుకోచ్చింది. దేశం కోసం పోరాడే వారికి సంబంధించిన స్టోరీనే ఈ వైల్డ్ డాగ్. వారి కుటుంబ జీవితం గురించి ఈ మూవీ సాగుతుంది అంటూ తెలిపింది.
 
ప్రస్తుతం కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫాంలు ప్రజలు ఆదరిస్తున్నారు. సిని పరిశ్రమ అభివృద్దికి ఈ ఓటీటీలు మరింత తోడ్పాటు అందిస్తాయి. ఇప్పటివరకు మనకు చాలా మంది నటీనటులు, డైరెక్టర్స్, రచయితలు ఉన్నారు. ఇలాంటి వారికి ఈ ఓటీటీలు చాలా ఉపయోగపడుతున్నాయి. 
 
ఇక మార్గదర్శకాలనేవి.. కేవలం ఓటీటీ సంస్థలకే కాకుండా.. సినిమాలకు కూడా ఉండాలి. అంతేకానీ సెన్సార్ ఉండాల్సిన అవసరం లేదు. సరైన ఆలోచనలు ఉన్న ప్రేక్షకులుగా సినిమాలను చూడాలి కానీ.. మరొకరి అభిప్రాయాలతో కాదు. నేను సినీ పిరిశ్రమలోనే పెరిగాను. నాకు మనుషులతోపాటు ప్రపంచాన్ని కూడా అర్థమయ్యేలా ఈ పరిశ్రమ చేసింది. 
 
కేవలం నటిగానే కాకుండా.. నా వ్యక్తిగతంగా నేను చేసిన పనుల వల్ల నేవు ఆనందంగా ఉంటాను. నిర్మాణ రంగంలో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది.. ఇప్పటికే నేను నిర్మాతగా ఓ వెబ్ సిరీస్ చేసినట్టు వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

కోనసీమపై దిష్టి కామెంట్లు.. డిప్యూటీ సీఎంగా అనర్హుడు... ఆయన్ని తొలగించాలి.. నారాయణ

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments