Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నకు చివరిగా స్పెషల్ పలావ్ పంపించా: జూనియర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాన్న మరణానికి కొద్దిరోజుల క్రితం నాకు ఫోన్ చేశారు. పలావ్ కావాలని అడిగారు. నాన్న అడిగారని షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళగానే స్పెషల్‌గా పలావ్ చేసి నాన్నకు పంపించానన్నారు.

Webdunia
ఆదివారం, 7 అక్టోబరు 2018 (17:20 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అరవింద సమేత సినిమా ప్రమోషన్‌లో వున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో దివికేగిన తన తండ్రి, నటుడు, హరికృష్ణ గురించి తలచుకున్నారు. అభిమానుల మధ్య భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించిన ఆసక్తికర విషయాలు, అరవింద సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు. తాను బాగా వంట చేస్తానని.. చివరిగా తన తండ్రికి భోజనం పంపించిన విషయం గురించి గుర్తుచేసుకున్నారు. 
 
ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాన్న మరణానికి కొద్దిరోజుల క్రితం నాకు ఫోన్ చేశారు. పలావ్ కావాలని అడిగారు. నాన్న అడిగారని షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళగానే స్పెషల్‌గా పలావ్ చేసి నాన్నకు పంపించానన్నారు. చివరి సారిగా నాన్నగారికి అదే ఇచ్చాను అని భావోద్వేగానికి గురయ్యారు. అరవింద సమేత ఈ నెల 11న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 
 
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌లో దర్శకుడు త్రివిక్రమ్, సినీ యూనిట్ మొత్తం తనకు అండగా నిలబడ్డారని.. త్రివిక్రమ్ ఆత్మబంధువుగా మారిపోయారని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్ పూర్తికాలేదు ... జస్ట్ విరామం మాత్రమే : రాజ్‌నాథ్ సింగ్

Covid-19: వేసవి నుంచి వర్షాకాలానికి ఎంట్రీ.. కోవిడ్-19తో పాటు జబ్బులతో జాగ్రత్త!

ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్, భారత్‌లో 300 ఎకరాల్లో లేడీస్ హాస్టల్స్

పాకిస్తాన్ పర్యటించిన తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments