Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ ఫ్యాన్సుకు శుభవార్త.. జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల వద్ద నారా కుక్కలు

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (15:23 IST)
Aadi
ఎన్టీఆర్ ఫ్యాన్సుకు శుభవార్త. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నవంబర్ నెలకు 22 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నవంబర్ నెలలో ఆది సినిమాని రీ-రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 
ఆది సినిమాలో ఆ జూనియర్ ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా హీరోయిన్‌గా నటించగా అలీ, ఎల్బీ శ్రీరామ్, చలపతిరావు వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు వీవీ వీనాయక్ డైరెక్షన్ చేశారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడమే కాక జూనియర్ ఎన్టీఆర్‌కి సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది.
 
అయితే నవంబర్ నెలలో విడుదలవుతున్న ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక పరీక్ష అనే చెప్పాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీకి ఈ మధ్య కాస్త దూరం పెరిగింది. 
 
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో ఆయన చేసిన ట్వీట్ అర్థవంతంగా లేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా దారుణమైన విధంగా జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల వద్ద నారా కుక్కలు అనే విధంగా ట్రోల్ చేశారు. 
 
ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తే టీడీపీ అభిమానులు మునుపటిలా జూనియర్ ఎన్టీఆర్‌ని సపోర్ట్ చేస్తూ థియేటర్లకు వెళ్లడం కాస్త కష్టమైన విషయమే. ఇప్పుడు రీ-రిలీజ్ విషయంలో ఒక్కో సినిమాతో ఒక్కో రికార్డులు బద్దలవుతున్నాయి.

ఒక్కడు సినిమా రికార్డులను జల్సా సినిమా బద్దలు కొడితే జల్సా సినిమా రికార్డులను కొన్ని చోట్ల చెన్నకేశవరెడ్డి సినిమా బద్దలు కొట్టింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎలా అయినా ఆది రీ-రిలీజ్ విషయంలో మిగతా సినిమాల రికార్డులు బద్దలు కొట్టాలని భావిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజలను మోసం చేసేవాళ్లు గొప్ప నాయకులు : నితిన్ గడ్కరీ

KCR: సీబీఐకి కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీష్ రావులు అరెస్ట్ అవుతారా?

ఏపీలో మెడ్‌టెక్ జోన్.. వైజాగ్‌లో మెడ్‌టెక్ విశ్వవిద్యాలయం -గ్లోబ్ ఆకారంలో గాజు భవనం

మైసూర్ వేడుకల స్ఫూర్తితో విజయవాడ ఉత్సవ్ - గొల్లపూడిలో 30 ఎకరాల ఎక్స్‌పో

నారా లోకేశ్‌ను 'ప్రజా గొంతుక' అంటూ అభివర్ణించిన నటుడు ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments