Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పేందుకు ఏముంది మీ గొప్పా.. చేసేందుకు ఏముంది గోల తప్పా...

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (15:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టనున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే, మాతృభాషను విస్మరించవద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు పలువురు మద్దతు ప్రకటించారు. అలాంటి వారిలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావులు ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి జొన్నవిత్తుల ఓ కవిత రాశారు. ఆ పాట రూపంలో పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తేశారు. అమ్మ భాష కోసం ఎవడున్నాడప్పా... పవన్ కల్యాణ్ ఒక్కడే కనిపించాడప్పా అంటూ రాగయుక్తంగా ఆయన ఓ గీతం ఆలాపించారు.
 
చెప్పేందుకు ఏముందీ మీ గొప్ప... చేసేందుకు ఏముందీ మీ గోల తప్పా అంటూ ఆయన రూపొందించిన పాట వీడియో రూపంలో వైరల్ అవుతోంది. ఇంగ్లీషు మీడియం అంశం నేపథ్యంలో తెలుగు భాష ప్రాశస్త్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలే జొన్నవిత్తుల అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments