Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజులు గడిచిపోతున్నాయ్... పరిస్థితులు మారడం లేదు : మహేష్ బాబు

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (13:59 IST)
హైదరాబాద్ నగరంలో పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి అత్యాచారం, హత్య కేసుపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. ఈ హత్య కేసుపై ఆయన తనలోని ఆవేదనను ఓ కవిత రూపంలో వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన ట్విట్టర్‌లో మరోసారి స్పందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశారు. 
 
"రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయని, సమాజంలో పరిస్థితులు మాత్రం మారడం లేదని, ఉన్నత విలువలను సాధించడంలో విఫలమవుతున్నామని" ట్వీట్ చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విన్నపం చేస్తున్నానని తెలిపారు. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. 
 
బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని మహేశ్ బాబు పేర్కొన్నారు. అందరం కలిసి మహిళలకు అండగా నిలుద్దామని, దేశాన్ని సురక్షితంగా మార్చుదామని మహేశ్‌ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు పీఎంవో, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు. కాగా, ఈ కేసులో నిందితులకు శిక్షపడేలా చూస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యూస్ కోసం బాల్కనీ ఎడ్జ్ పైన బోయ్ ఫ్రెండ్‌తో మోడల్ శృంగారం, కిందపడి మృతి

మభ్యపెట్టి శారీరకంగా వాడుకున్నాడు.. బాలిక శీలానికి రూ.5 లక్షలు వెలకట్టిన పెద్దలు!

పింకీ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా నాన్నా, నన్ను క్షమించు: భర్త సూసైడ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : అంతుచిక్కని కేజ్రీవాల్ వ్యూహాలు... ప్రధాని మోడీకి ప్రతిష్టాత్మకం!

కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు.. మే 15 నుండి మే 26 వరకు 12 రోజుల పాటు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments