Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గులాబీ' కోసం ఇల్లు అమ్మేద్దామనుకున్నాను: జేడీ

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (12:35 IST)
'గులాబీ'... కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా హీరో జేడీ చక్రవర్తి కెరీర్‌ని ఏ విధంగా మలుపు తిప్పిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఈటీవీ కార్యక్రమం 'ఆలీతో సరదాగా'లో పాల్గొన్న జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ఈ సినిమాను గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. 
 
ఈ మేరకు జేడీ మాట్లాడుతూ... 'గులాబీ' కథను కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ కథను తీసుకుని నిర్మాత దువ్వాసి మోహన్ దగ్గరికి వెళితే, కథంతా వినేసి 'హీరో రాజశేఖర్‌తో చేస్తే ఎలా ఉంటుంది?' అన్నాడు. అప్పటికి దువ్వాసి మోహన్ ఇంకా యాక్టర్ కాలేదు. దాని తర్వాత ఆ కథని తీసుకుని చాలా మంది నిర్మాతల దగ్గరికి వెళ్లాను. 
 
కానీ నాతో సినిమా చేయడానికి వాళ్లెవరూ ముందుకురాలేదు. దాంతో ఇక ఇల్లు అమ్మేద్దామని నిర్ణయించుకుని, ప్రయత్నాలు మొదలెట్టాను. ఈ విషయం వర్మగారికి తెలిసి నాకు చీవాట్లు పెట్టారు. ఇల్లు అమ్మొద్దనీ .. అమితాబ్‌తో కలిసి తానే ఈ సినిమాను నిర్మిస్తానంటూ ముందుకొచ్చారు" అని చెప్పుకొచ్చారు.
 
మరి అంత కమిట్‌మెంట్ ఉండబట్టే సినిమా అంత బాగా వచ్చిందేమో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments