Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గులాబీ' కోసం ఇల్లు అమ్మేద్దామనుకున్నాను: జేడీ

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (12:35 IST)
'గులాబీ'... కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా హీరో జేడీ చక్రవర్తి కెరీర్‌ని ఏ విధంగా మలుపు తిప్పిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఈటీవీ కార్యక్రమం 'ఆలీతో సరదాగా'లో పాల్గొన్న జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ఈ సినిమాను గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. 
 
ఈ మేరకు జేడీ మాట్లాడుతూ... 'గులాబీ' కథను కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ కథను తీసుకుని నిర్మాత దువ్వాసి మోహన్ దగ్గరికి వెళితే, కథంతా వినేసి 'హీరో రాజశేఖర్‌తో చేస్తే ఎలా ఉంటుంది?' అన్నాడు. అప్పటికి దువ్వాసి మోహన్ ఇంకా యాక్టర్ కాలేదు. దాని తర్వాత ఆ కథని తీసుకుని చాలా మంది నిర్మాతల దగ్గరికి వెళ్లాను. 
 
కానీ నాతో సినిమా చేయడానికి వాళ్లెవరూ ముందుకురాలేదు. దాంతో ఇక ఇల్లు అమ్మేద్దామని నిర్ణయించుకుని, ప్రయత్నాలు మొదలెట్టాను. ఈ విషయం వర్మగారికి తెలిసి నాకు చీవాట్లు పెట్టారు. ఇల్లు అమ్మొద్దనీ .. అమితాబ్‌తో కలిసి తానే ఈ సినిమాను నిర్మిస్తానంటూ ముందుకొచ్చారు" అని చెప్పుకొచ్చారు.
 
మరి అంత కమిట్‌మెంట్ ఉండబట్టే సినిమా అంత బాగా వచ్చిందేమో...

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments