Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధంలో గెలిచామా లేదా అన్నదే పాయింట్... 'జవాన్' ట్రైలర్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'జవాన్'. ఈ చిత్రం వచ్చే నెల ఒకటో తేదీన విడుదల కానుంది. బీవీఎస్ రవి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్. ఈ చిత్ర

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (10:15 IST)
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'జవాన్'. ఈ చిత్రం వచ్చే నెల ఒకటో తేదీన విడుదల కానుంది. బీవీఎస్ రవి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్. ఈ చిత్రం తేజు అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్, ఆసక్తిని రేకెత్తించేలా వుంది.
 
"యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా.. వెనకోడు ఆగిపోయాడా.. ముందోడు కూలిపోయాడా కాదురా.. యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం" అంటూ విలన్‌తో సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ అవుతుందనిపిస్తోంది. 
 
దేశ ద్రోహుల కార్యకలాపాలకు అడ్డుగా నిలుస్తూ .. వాళ్ల బారి నుంచి ఒక వైపున తన కుటుంబాన్ని .. మరో వైపున తన దేశాన్ని కాపాడుకునే యువకుడిగా ఈ ట్రైలర్‌లో సాయిధరమ్ తేజ్ కనిపిస్తున్నాడు. మొత్తం మీద ఈ ట్రైలర్.. లవ్, యాక్షన్‌ సీన్లతో ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments