Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

ఠాగూర్
గురువారం, 23 జనవరి 2025 (14:38 IST)
భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి శ్రీవారి సన్నిధి తిరుమల తిరుపతిలో హాయిగా జీవించాలని హీరోయిన్ జాన్వీ కపూర్ తన మనసులోని మాటను వెల్లడించారు. దివంగత నటి శ్రీదేవి కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తన టాలెంట్‌తో అగ్రనటిగా ఎదిగింది. పాన్ ఇండియా మూవీలు చేస్తూ ఎంతో బిజీ లైఫ్‌ను గడుపుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో దేవరన నటించిన జాన్వీ.. ఇపుడు రామ్ చరణ్‌తో ఆర్సీ 16లో హీరోయిన్‌గా నటిస్తుంది. 
 
ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ షోలో పాల్గొని పిచ్చాపాటిగా మాట్లాడారు. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది తన కోరిక అని చెప్పింది. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి తిరుమలలో హాయిగా జీవించాలని ఉందని చెప్పారు. ప్రతి రోజూ అరటి ఆకులో అన్నం తింటూ గోవిందా గోవిందా అని స్మరించుకోవాలని ఉందని తెలిపారు. పనిలోపనిగా దర్శకుడు మణిరత్నం సినిమాల్లోని సంగీతాన్ని వింటూ కూర్చోవాలని ఉందని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments