Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత యుద్ధనౌకల పేల్చివేతకు జైషే ఉగ్రవాదుల ప్లాన్

భారత యుద్ధ నౌకల పేల్చివేతకు పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మొహ్మద్ సంస్థకు చెందిన ముష్కరులు ప్లాన్ వేసినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ముఖ్యంగా, ఇండియన్ నేవీలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న తూర్పు నౌకాదళం పరి

Webdunia
గురువారం, 19 జులై 2018 (09:27 IST)
భారత యుద్ధ నౌకల పేల్చివేతకు పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మొహ్మద్ సంస్థకు చెందిన ముష్కరులు ప్లాన్ వేసినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ముఖ్యంగా, ఇండియన్ నేవీలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న తూర్పు నౌకాదళం పరిధిలో ఉన్న యుద్ధ నౌకలను పేల్చివేయాలని కుట్ర పన్నినట్టు సమాచారం. ఇందుకోసం ఆ సంస్థ.. కొందరు డీప్‌ సీ డైవర్ల(సముద్ర అంతర్భాగంలోనే దాడిచేయగల నైపుణ్యం కలిగిన శిక్షకులు)కు పాకిస్థాన్‌లో శిక్షణనిచ్చినట్టు గుర్తించారు. 
 
మొత్తం 10 మంది ఉగ్రవాద డైవర్లు శిక్షణ పూర్తి చేసుకుని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ముజఫరాబాద్‌ సమీపంలోని - కెల్‌, ఆత్ముకమ్‌, దుధినిహల్‌, లీపా లోయల గుండా భారత్‌లోకి చొరబడే అవకాశాలున్నట్లు సమాచారమందింది. ముఖ్యంగా, సముద్ర అంతర్భాగంలోకి వెళ్లి దాడులు చేయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉగ్రవాదులకు జైషే సంస్థ అందించిందట. 
 
ఈ దాడి కూడా పఠాన్‌కోట్‌ దాడి తరహాలోనే నౌకాదళంపై కూడా విరుచుకుపడాలన్నది జైషే, లష్కర్‌ల వ్యూహమని ఈ కేంద్రం వివరించింది. దీనిపై నౌకాదళం అప్రమత్తమయ్యింది. నిఘా పెంచింది. యుద్ధనౌకల్నేగాక జలాంతర్గాములను కూడా ఆ సంస్థ టార్గెట్‌ చేస్తున్నట్లు తెలియడంతో కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ప్రతికూలతలను పసికట్టగల అత్యాధునిక సెన్సార్లను వాటికి అమర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments