Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ షో నటుడు శాంతి స్వరూప్ ఇలా అనేశాడే.. నిజమేనా?

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (19:03 IST)
Shanthi Swaroop
జబర్దస్త్ షో బాగా పాపులర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ షోలో నటించే వారు బాగా సంపాదించుకుంటారని, పారితోషికం బాగానే పుచ్చుకుంటారని బయట టాక్ వుంది. కానీ అందులో నిజం లేదని తేల్చేసాడు శాంతి స్వరూప్. అసలు ఆ షోలో ఇచ్చే పారితోషికంపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు శాంతి. తెలుగు బుల్లితెరపై నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లు జబర్దస్త్ చరిత్ర సృష్టించింది. 
 
అప్పటి వరకు ఎన్ని షోలు వచ్చినా కూడా దీని స్థాయిలో మాత్రం రేటింగ్ తీసుకురాలేదు. ఏడేళ్లుగా నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇండస్ట్రీకి ఎంతోమంది కమెడియన్స్‌ను కూడా అందించింది జబర్దస్త్. అక్కడ్నుంచి వచ్చిన వాళ్లే ఇప్పుడు సినిమాలు కూడా చేసుకుంటున్నారు. 
 
జబర్దస్త్ క్రేజ్‌తోనే వాళ్లకు బాగా డబ్బులు వస్తున్నాయి కూడా. ఈ షోతో వచ్చిన ఇమేజ్ కారణంగా బయట ఈవెంట్స్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఫారెన్ వెళ్లి అక్కడ కూడా స్టేజ్ పర్ఫార్మెన్సులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ షోలో వాళ్లకు అందుతున్న రెమ్యునరేషన్స్‌పై మాత్రం ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లకు ఎపిసోడ్‌కు 4 లక్షల వరకు వస్తుందని చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. మిగిలిన వాళ్లకు కూడా కనీసం లక్షన్నర నుంచి 2 లక్షలకు తక్కువ కాకుండా వస్తుందని ప్రచారం ఉంది. 
 
ఇవన్నీ నిజమేనేమో.. ఒక్కో ఎపిసోడ్‌కు అంత ఇస్తున్నారేమో అనే అనుమానాలు కూడా అందర్లోనూ ఉన్నాయి. అయితే కొందరు జబర్దస్త్ కమెడియన్స్ చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తుంటే మాత్రం అంత ఉండదని తేలిపోయింది. 
 
ఇవన్నీ బయటికి చెప్పుకునే దొంగ లెక్కలు.. ఇచ్చుకునే బిల్డప్పులే కానీ అన్నేసి లక్షలు ఇచ్చేంత సీన్ అక్కడ లేదని మరో కమెడియన్ శాంతి స్వరూప్ చెప్తున్నాడు. వీళ్లకు అన్నేసి లక్షలు ఇస్తున్నారని అనవసరంగా బయట చెప్తారు కానీ తమకు వచ్చేది మాత్రం అంత ఉండదని చెప్పుకొచ్చాడు శాంతి. 
 
నిజానికి తమకు జబర్దస్త్ కంటే కూడా బయట చేసే ఈవెంట్స్ నుంచి ఎక్కువ సంపాదించుకుంటామని చెప్తున్నాడు శాంతి స్వరూప్. అంతేకాదు అక్కడ రెగ్యులర్‌గా పేమెంట్ ఇచ్చేవాళ్లు కూడా తక్కువే ఉన్నారని సంచలన విషయాలు చెప్పాడు శాంతి. ఏదేమైనా కూడా మల్లెమాల ఇచ్చేదాని కంటే కూడా బయట చెప్పుకునేది మాత్రం రెండింతలు ఉందనేది శాంతి స్వరూప్ చెప్తున్న మాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఆగ్రహం : సస్పెండ్ దిశగా ఆలోచనలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments