Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహర్షి' నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

Webdunia
బుధవారం, 8 మే 2019 (13:24 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'మహర్షి'. ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించారు. వారిలో ఒకరు దిల్ రాజు. ఈయన ఇంట్లో బుధవారం ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. 
 
'మహర్షి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో 'దిల్' రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు జరిగాయి. హైద‌రాబాద్‌, శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని 'దిల్' రాజు కార్యాల‌యంలో ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ బృందం ప‌లు రికార్డుల‌ని ప‌రిశీలించారు. 
 
గ‌తంలోనూ భారీ చిత్రాల రిలీజ్ స‌మ‌యంలో నిర్మాత‌ల ఆఫీసులు, ఇళ్ల‌పై ఐటీ సోదాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 'మ‌హ‌ర్షి' చిత్రం మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌గా ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 
 
వంశీ పైడిపల్లి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించాడు. జగపతి బాబు విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments