Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలీజ్‌కు ముందే "మహర్షి" నిర్మాతలకు కాసులపంట

Webdunia
బుధవారం, 8 మే 2019 (12:46 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "మహర్షి". ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. వంశీ పైడివల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సి.అశ్వినీదత్, పొట్లూరు వరప్రసాద్‌లు కలిసి సంయుక్తంగా నిర్మించారు. 
 
శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో సుమారు 400 స్క్రీన్లపై రిలీజ్ కానుంది. పైగా, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో రూ.150 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఒక్క తెలుగు హక్కులే రూ.100 కోట్లను సంపాదించి పెట్టాయి. ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కానీ, ఈ చిత్రం ప్రిరిలీజ్ బిజినెస్ మాత్రం ఇప్పటికే రూ.150 కోట్ల మేరకు తెచ్చిపెట్టింది. ఇక చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంటే మాత్రం నిర్మాతల పంట పండినట్టేనని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments