Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాగింతపై రాచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

ఠాగూర్
గురువారం, 17 అక్టోబరు 2024 (17:04 IST)
దర్శక రచయితలు కాగితంపై రాసిచ్చినదాన్ని తెరపై ఒక నటిగా ఆవిష్కరించానని జాతీయ అవార్డు గ్రహీత నటి నిత్యామీనన్ అన్నారు. ధనుష్ హీరోగా నటించిన తిరుచిట్రాంబలం చిత్రానికిగాను ఆమెకు జాతీయ అవార్డు వరించింది. దీనిపై ఆమె తన స్పందనను గురువారం ఓ ఆడియో రూపంలో తెలియజేశారు. ఈ అవార్డు కేవలం తిరుచిట్రాంబలం చిత్రంలోని పాత్రకు మాత్రమే కాదనని, అనేక చిత్రాల్లోని తన నటనకు గుర్తింపుగా లభించిందన్నారు. 
 
'ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం. దాన్ని స్వీకరించిన వెంటనే పలువురు జ్యూరీ సభ్యులను కలిశా. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారితో మాట్లాడడం కొత్త అనుభూతి. ఈ అవార్డు ఈ ఒక్క సినిమా (తిరుచిట్రాంబలం)కే కాదు, ఇప్పటి వరకూ నేను పోషించిన పాత్రలన్నింటికీ దక్కుతుంది. తిరులోని శోభన పాత్ర పోషించడం తేలిక కాదని ధనుష్‌ సినిమా ప్రారంభానికి ముందు చెప్పారు. ఆ రోల్‌ నాకు పూర్తి భిన్నమైంది. కానీ, దర్శక- రచయితలు కాగితంపై ఏం రాస్తారో.. దాన్ని తెరపై ఓ నటిగా ఆవిష్కరించా. మూస ధోరణికి భిన్నమైన ఆ పాత్రకు అవార్డుకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఇంటెన్స్‌ యాక్టింగ్‌, మూవీస్‌కు అవార్డులు వస్తాయని చాలామంది అనుకుంటుంటారు. అది అవాస్తవం' అని పేర్కొన్నారు.
 
కాగా, ప్రస్తుతం తన చేతిలో పాండిరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తున్నా. ఇప్పటివరకూ నేను నటించని కొత్త జానర్‌లో అది రూపొందుతోంది. ఈ యేడాది చివరిలో గోల్డెన్‌ వీసా సినిమా ప్రారంభం కానుంది. కాదలిక్కా నేరమిల్లై (తమిళ్‌) షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే విడుదల కానుంది అని ఆమె వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాన్స్​జెండర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు.. ఎక్కడో తెలుసా? (video)

పిఠాపురంపై ఈగ వాలనీయని పవన్.. విద్యార్థుల కష్టాలు తెలిసి కంప్యూటర్లు (video)

జగన్ ఆదేశిస్తే గంటలోనే బాబును, లోకేష్‌లను లేపేస్తా.. బోరుగడ్డ భార్య ఏమంటోంది?

శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. కుటుంబం బలి

అమ్మాయితో టీడీపీ నేత రాసలీలలు - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments