నాగార్జున మేనకోడలితో పెళ్లా? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన 'గూఢచారి' హీరో

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (14:28 IST)
గూఢచారితో హిట్ కొట్టి విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన హీరో అడవి శేష్ పెళ్లి గురించి ప్రస్తుతం ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. గూఢచారిలో తనతో పాటు నటించిన సుప్రియను అడవి శేష్ పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు, చాలా కాలం నుండి అడవి శేష్ షాకింగ్ న్యూస్ చెబుతా అంటూ సోషల్ మీడియాలో ఆసక్తి కరమైన పోస్ట్‌లు పెడుతుండటంతో జనం తమకు తోచింది ఊహించుకుని వాటిని షేర్ చేసేసుకున్నారు.
 
అయితే తాజాగా అడవి శేష్ దీనిపైన క్లారిటీ ఇచ్చేసాడు. సోషల్ మీడియాలో తనకు సుప్రియకు వివాహం జరగబోతున్నట్లు వస్తున్న వార్తలు ఒట్టి పుకార్లే అని కొట్టిపారేసాడు. ఫేక్ న్యూస్... బాధ్యతా రాహిత్యం అంటూ ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డాడు. ప్రస్తుతం తన జీవితంలో ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే అది సినిమానే అన్నారు. రచయితగా కూడా తాను చాలా సంతృప్తిగా ఉన్నట్లు, ఇవి తప్ప తాను వేరే విషయాల జోలికి పోదలచుకోలేదని తేల్చి చెప్పాడు.
 
తమాషా ఏమిటంటే నిన్న నాగార్జున జగన్‌తో భేటీ అయిన సందర్భంలో సుప్రియ, శేష్‌ల పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికే నాగార్జున జగన్ దగ్గరకు వెళ్లారని మరో పుకారు కూడా సోషల్ మీడియాలో వచ్చింది. మొత్తానికి అడవి శేష్ క్లారిటీతో ఇవన్నీ కేవలం పుకార్లే అని తేలిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments