Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ కోసం నిర్మాతలుగా మారనున్న తండ్రీకొడుకులు!

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (13:08 IST)
హీరో అఖిల్ కోసం తండ్రీ తనయులు నిర్మాతలుగా మారనున్నారు. ఆ తండ్రీ కుమారులు ఎవరో కాదు. అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య. వీరిద్దరూ కలిసి తమ బిడ్డ అఖిల్ అక్కినేనితో ఓ సినిమాను తీయనున్నారు. అఖిల్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా ఉంటుందని గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ, ‌సదరు సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే, ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చటంతో అఖిల్‌తో సినిమా చేసేందుకు ఈసారి నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా రంగంలోకి దిగుతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ఓ టాక్ వినిపిస్తుంది. 
 
గతంలో కిరణ్ అబ్బవరంతో "వినరో భాగ్యము విష్ణు కథ" అనే సినిమాను మురళీ కిషోర్ అనే దర్శకుడు తెరకెక్కించారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున, నాగ చైతన్యలు నిర్మాతలుగా మారేందుకు సిద్ధమయ్యారు. పైగా, ఈ చిత్రానికి "లెనిన్" అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తొంది. అన్నపూర్ణ స్టూడియోస్‌కు అనుబంధంగా "మనం" ఎంటర్‌ప్రైజెస్ అనే బ్యానర్‌లో అఖిల్ సినిమాను నాగార్జున, చైతన్యలు నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments