Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ కోసం నిర్మాతలుగా మారనున్న తండ్రీకొడుకులు!

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (13:08 IST)
హీరో అఖిల్ కోసం తండ్రీ తనయులు నిర్మాతలుగా మారనున్నారు. ఆ తండ్రీ కుమారులు ఎవరో కాదు. అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య. వీరిద్దరూ కలిసి తమ బిడ్డ అఖిల్ అక్కినేనితో ఓ సినిమాను తీయనున్నారు. అఖిల్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా ఉంటుందని గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ, ‌సదరు సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే, ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చటంతో అఖిల్‌తో సినిమా చేసేందుకు ఈసారి నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా రంగంలోకి దిగుతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ఓ టాక్ వినిపిస్తుంది. 
 
గతంలో కిరణ్ అబ్బవరంతో "వినరో భాగ్యము విష్ణు కథ" అనే సినిమాను మురళీ కిషోర్ అనే దర్శకుడు తెరకెక్కించారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున, నాగ చైతన్యలు నిర్మాతలుగా మారేందుకు సిద్ధమయ్యారు. పైగా, ఈ చిత్రానికి "లెనిన్" అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తొంది. అన్నపూర్ణ స్టూడియోస్‌కు అనుబంధంగా "మనం" ఎంటర్‌ప్రైజెస్ అనే బ్యానర్‌లో అఖిల్ సినిమాను నాగార్జున, చైతన్యలు నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంబేలెత్తిస్తున్న భానుడు: ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments