బిగ్ బాస్‌లో మళ్లీ అవకాశం వచ్చినా వెళ్లను, నా సర్వం కోల్పోయా: శివజ్యోతి షాకింగ్ కామెంట్స్

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (15:59 IST)
బిగ్ బాస్-3 సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. బిగ్ బాస్ ఎపిసోడ్ల కోసం జనం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. టీవీలకు అతుక్కుని పోతున్నారు. అయితే 14వ వారాన్ని దాటడంతో ఒకింత టెన్షన్ ప్రజల్లో మరింత పెరిగింది. ఎవరు విజేతగా నిలుస్తారన్నదే ఇప్పుడు అందరిలోను మెదులుతున్న ప్రశ్న.
 
అయితే తాజాగా శివజ్యోతి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్-3 నుంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన శివజ్యోతి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ తెలంగాణా యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే శివజ్యోతి తాను ఎలిమినేట్ కావడాన్ని లైట్ తీసుకుంటోంది. నేను అందరితో మంచిగా ఉండటంతోనే 14 వారాల పాటు బిగ్ బాస్-3లో ఉండగలిగాను.
 
ఇది నన్ను అభిమానించే వారందరికీ తెలుసు. నేను హౌస్‌ను మిస్ అవుతానన్న బాధ ఉంది. స్నేహితులందరినీ వదులుకున్నాను. ఆ బాధ ఉంది. అయితే బిగ్ బాస్-3 హౌస్ లోకి వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డా. కుటుంబాన్ని మిస్సవుతున్నానన్న బాధ నాలో అలాగే ఉండేది. కానీ మూడు వారాలు దాటిన తరువాత హౌస్‌లోని వారే నా కుటుంబ సభ్యులు అయిపోయారు. అయితే నేను బయటకు వచ్చాను. వీళ్ళే గెలవాలి అని ఒకరినే నేను చెప్పలేను. 
 
నేను బయటకు వచ్చేశా కాబట్టి ఎవరు గెలిచినా నాకు అనవసరం. బిగ్ బాస్-3 నాకు మంచి స్నేహితులనిచ్చింది. నా అభిమానులను నాకు మరింత దగ్గర చేర్చింది. అది చాలంటోంది శివజ్యోతి. ఇక యధావిధిగా తన జాబ్‌లో కొనసాగుతానంటోంది. బిగ్ బాస్ -3ని వదిలి బయటకు వచ్చినప్పుడు ఏమి అనిపించలేదు.. కానీ అభిమానులందరూ కనిపించచోటల్లా అడుగుతుంటే మాత్రం సర్వం కోల్పోయినంత బాధ నాలో ఉందంటోంది శివజ్యోతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏకంగా 15 బ్యాంకుల శంకుస్థాపన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments