Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు థియేటర్లు ఓపెన్ చేయడం రిస్క్‌తో కూడుకున్న పని : నిర్మాత సురేష్

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:09 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనేవుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. దీనిపై ప్రముఖ నిర్మాత దగ్గుబాట సురేష్ స్పందించారు. కేసులు పెరుగుతున్న ఇలాంటి ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల రీఓపెన్ రిస్క్‌తో కూడుకున్న ప‌ని అని ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100కిపైగా థియేట‌ర్ల‌ను లీజుకు తీసుకున్న అగ్ర‌నిర్మాత సురేశ్ బాబు ఇప్ప‌డ‌ప్పుడే థియేట‌ర్ల‌ను రీఓపెన్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇటువంటి సమయంలో థియేట‌ర్లు ఓపెన్ చేయ‌డం రిస్క్‌తో కూడిన ప‌ని. థియేట‌ర్ల‌లో 3 గంట‌ల‌పాటు ఉండి.. జీవితాల‌ను రిస్క్‌లో పెట్టే అవ‌కాశం ఉంటుంద‌ని, ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని సురేశ్ బాబు చెప్పుకొచ్చారు. 
 
క‌రోనా కేసులు త‌గ్గిన త‌ర్వాత చైనాలో థియేట‌ర్లు ఓపెన్ చేశారు. కానీ వారు మ‌ళ్లీ థియేట‌ర్ల‌ను మూసివేశారు. దీన్ని మ‌న‌మంతా ఓ ఉదాహ‌ర‌ణగా తీసుకోవాల‌ని, వ్యాపార దృక్పథంతో ఆలోచించొద్దని కోరారు. ఇలాంటి సమయంలో లో ప్ర‌భుత్వం థియేట‌ర్లు రీఓపెన్ చేసుకునే అవ‌కాశ‌మిస్తుంద‌ని తాను అనుకోవ‌డం లేదని సురేశ్ బాబు అభిప్రాయపడ్డారు.
 
కాగా, ఈ నెలాఖరుతో ప్రస్తుతం అమల్లో వున్న అల్‌లాక్ 2.0 ముగియనుంది. అన్‌‌లాక్ 3.0లో భాగంగా సినిమా థియేటర్లకు అనుమతి ఇవ్వొచ్చన్న ప్రచారం సాగుతోంది. థియేటర్లలో సామాజిక దూరం పాటిస్తూ, ప్రేక్షకుల భద్రతకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటామని, ఆన్‌లైన్ విధానంలో టిక్కెట్లు విక్రయిస్తూ, ఒక షోకు మరో ఆటకు మధ్య అర్థగంట సమయం ఉండేలా చూసుకుంటామని థియేటర్ల యజమానులు హామీ ఇస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Thunderstorms: జూన్ 2 నుండి 4 వరకు ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

కర్నాటకలో దారుణం.. బేకరీలో వ్యక్తిని నరికి చంపిన దుండగులు

Kavamma: అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ గుండెపోటుతో కుప్పకూలి భక్తుడు మృతి (video)

Bihar: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం- స్నాక్స్ ఇస్తానని తీసుకెళ్లి..?

గుండ్లపాడును వెంటాడుతున్న ఫ్యాక్షన్ భూతం.. ఆ గ్రామంలో 18 హత్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments