Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతల కష్టాలు - డబ్బు విలువ తెలుసు ... శృతిహాసన్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (13:54 IST)
సాధారణంగా హీరోయిన్లపై తరచుగా ఓ కంప్లైంట్ వినిపిస్తూ ఉంటుంది. ఒక సినిమా హిట్టు కాగానే పారితోషికాలు పెంచేస్తారని, నిర్మాతలకు చుక్కలు చూపిస్తారని రకరకాలు చెప్పుకొంటుంటారు. శ్రుతిహాసన్ విషయంలోనూ ఇలాంటి వార్తలే బయటకు వచ్చాయి. ఈ యేడాది వరుసగా రెండు హిట్లు కొట్టింది శ్రుతి. ఇప్పుడు 'సలార్‌‌'లోనూ నటిస్తున్నారు.
 
అయితే, పారితోషికం గట్టిగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెనకంజ వేస్తున్నారని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కొంటున్నారు. వీటిపై శ్రుతి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. "నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినదాన్ని. నిర్మాతల సాధక బాధకాలు నాకు బాగా తెలుసు. మా నాన్న కూడా ఓ నిర్మాతే. అలాంటప్పుడు నిర్మాతల్ని నేనెందుకు ఇబ్బంది. పెడతాను?" అని ప్రశ్నించింది.
 
పైగా, "నాకు డబ్బు విలువ బాగా తెలుసు. మా అమ్మానాన్నలు అలా పెంచారు. చేసే ప్రతి పనికీ ఓ విలువ ఉంటుంది. నా వాల్యూ ఎంతో నాకు బాగా తెలుసు. అంతకు మించి ఆశించింది ఏం లేదు. ఓ సినిమా ఒప్పుకోవడానికీ, వద్దని చెప్పడానికీ చాలా కారణాలు ఉంటాయి. ప్రతీసారీ పారితోషికమే ప్రాతిపదిక కాదు. ఒక్కోసారి పాత్ర నచ్చినప్పుడు తీసుకొనే రెమ్యునరేషన్ గురించి అస్సలు ఆలోచించను. నేనే కాదు. చాలామంది కథానాయికలు ఇలానే ఉంటారు. కానీ బయట మరోలా ప్రచారం జరుగుతుంటుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments