Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతల కష్టాలు - డబ్బు విలువ తెలుసు ... శృతిహాసన్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (13:54 IST)
సాధారణంగా హీరోయిన్లపై తరచుగా ఓ కంప్లైంట్ వినిపిస్తూ ఉంటుంది. ఒక సినిమా హిట్టు కాగానే పారితోషికాలు పెంచేస్తారని, నిర్మాతలకు చుక్కలు చూపిస్తారని రకరకాలు చెప్పుకొంటుంటారు. శ్రుతిహాసన్ విషయంలోనూ ఇలాంటి వార్తలే బయటకు వచ్చాయి. ఈ యేడాది వరుసగా రెండు హిట్లు కొట్టింది శ్రుతి. ఇప్పుడు 'సలార్‌‌'లోనూ నటిస్తున్నారు.
 
అయితే, పారితోషికం గట్టిగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెనకంజ వేస్తున్నారని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కొంటున్నారు. వీటిపై శ్రుతి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. "నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినదాన్ని. నిర్మాతల సాధక బాధకాలు నాకు బాగా తెలుసు. మా నాన్న కూడా ఓ నిర్మాతే. అలాంటప్పుడు నిర్మాతల్ని నేనెందుకు ఇబ్బంది. పెడతాను?" అని ప్రశ్నించింది.
 
పైగా, "నాకు డబ్బు విలువ బాగా తెలుసు. మా అమ్మానాన్నలు అలా పెంచారు. చేసే ప్రతి పనికీ ఓ విలువ ఉంటుంది. నా వాల్యూ ఎంతో నాకు బాగా తెలుసు. అంతకు మించి ఆశించింది ఏం లేదు. ఓ సినిమా ఒప్పుకోవడానికీ, వద్దని చెప్పడానికీ చాలా కారణాలు ఉంటాయి. ప్రతీసారీ పారితోషికమే ప్రాతిపదిక కాదు. ఒక్కోసారి పాత్ర నచ్చినప్పుడు తీసుకొనే రెమ్యునరేషన్ గురించి అస్సలు ఆలోచించను. నేనే కాదు. చాలామంది కథానాయికలు ఇలానే ఉంటారు. కానీ బయట మరోలా ప్రచారం జరుగుతుంటుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments