Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చంపేందుకు రమ్య కుట్ర చేస్తున్నారు.. నటుడు నరేష్ ఆరోపణ

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (13:01 IST)
తన మూడో భార్య రమ్యపై నటుడు నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు రమ్య కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆస్తికోసం తనను చంపే ప్రయత్నం చేసిందని చెప్పారు. ఇదే విషయంపై ఆయన తాజాగా కోర్టును ఆశ్రయించారు. అలాగే, దీనిపై గచ్చిబౌలి పౌలీసులకు కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. 
 
రోహిత్ శెట్టితో కలిసి రమ్య తనను చంపేందుకు కుట్రలు చేస్తోందని అన్నారు. ఆమెతో తాను నరకాన్ని అనుభవిస్తున్నానని, తనను, చంపేస్తారనే భయంతో ఒంటరిగా బయటకు కూడా వెళ్లలేకపోతున్నానని చెప్పారు. ఓ పోలీస్ అధికారి సాయంతో తన ఫోన్‌ను రమ్య హ్యాక్ చేయించి, తన పర్సనల్‌ మేసేజ్‌లను చూసేదని అన్నారు. తనకు రమ్యకు విడుకాలు ఇప్పంచాలని కోరారు.
 
కాగా, గత 2010 మార్చిలో రమ్యతో తనకు బెంగుళూరులో పెళ్లి జరిగిందని నరేశ్ తెలిపారు. కట్నం తీసుకోకుండానే తాను పెళ్లి చేసుకున్నాని తన తల్లి విజయ నిర్మల ఆమెకు రూ.30 లక్షలు విలువైన ఆభరణాలను చేయించిందని చెప్పారు. అయితే, పెళ్లైన కొన్ని నెలలు నుంచే రమ్య తనను వేధించడాన్ని ప్రారంభించిందని తెలిపారు.
 
తనకు తెలియకుండా ఆమె చేసిన అప్పుల్లో రూ.10 లక్షల మేరకు తీర్చేశానని తెలిపారు. తమకు 2012లో రణవీర్‌ అనే కుమారుడు పుట్టాడని వెల్లడించాడు. ఇదిలావుంటే నరేష్ ప్రస్తుతం పవిత్ర లోకేశ్‌ సహజీవనం చెస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments