Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం: పృథ్వీరాజ్

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (17:57 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని టాలీవుడ్ సీనియర్ నటుడు పృధ్వీ రాజ్ ప్రకటించారు. నటుడు పృధ్వీ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను జనసేనలో చేరబోతున్నానని, మెగాబ్రదర్ నాగబాబును కలిశానని చెప్పారు. 
 
తాను వైఎస్సార్‌సీపీ కోసం కష్టపడి పనిచేశానని, అయితే కోవిడ్‌-19తో బాధపడుతున్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఏ నాయకుడూ తనతో మాట్లాడలేదన్నారు. పృధ్వీరాజ్ గతంలో వైఎస్సార్‌సీపీ తరపున పనిచేసిన సంగతి తెలిసిందే.
 
గతంలో వైకాపా చీఫ్ జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా వ్యవహించారు. వైసీపీకి అనుకూల వాయిస్ వినిపించే క్రమంలో రాజకీయ ప్రత్యర్ధుల పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 
 
జగన్ సీఎం అయిన తరువాత పృథ్వీరాజ్‌కు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించారు. అయితే, ఆ సమయంలోనే ఆయన పైన కొన్ని లైంగిక ఆరోపణలు వచ్చాయి. వీటి పైన టీటీడీ విచారణకు ఆదేశించింది. దీంతో పాటుగా పృధ్విరాజ్‌ను ఆ పదవి నుంచి తప్పించింది.
 
అయితే, ఆ విచారణకు సంబంధించిన నివేదిక పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. ఇక, అప్పటి నుంచి కొంత కాలం మౌనంగా ఉన్న పృధ్విరాజ్ కరోనాతో బాధపడ్డారు. ఆ సమయంలో చిరంజీవి తనకు ప్రాణం నిలబెట్టారంటూ పృధ్వి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం