Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలన్ పాత్రలను చేస్తానంటున్న మాస్ మహారాజా

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (11:56 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న నటుడు రవితేజ. ఒకపుడు చిన్నబడ్జెట్‌, సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. దీంతో రవితేజ కోసం నిర్మాతలు క్యూకట్టారు. అయితే, ఇపుడు పరిస్థితి తారుమారైంది. ఆయన నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈ క్రమంలో ఈనెల 24వ తేదీన 'డిస్కోరాజా' పేరుతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో నభా నటేష్, తాన్యా హోప్‌లు హీరోయిన్లుగా నటించారు. 
 
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, 'గతంలో నేను చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తిభిన్నంగా ఉంటుంది. కథాకథనాలు.. దర్శకుడు వీఐ ఆనంద్ టేకింగ్ ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. మారిన ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఈ సినిమా ఉంటుంది. కాన్సెప్టులోను.. పాత్రల్లోను కొత్తదనం వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు. 
 
అలాంటి ప్రేక్షకుల కోసం విలన్‌గా కనిపించడానికి కూడా నేను సిద్ధమే. అయితే ఆ విలనిజం కొత్తగా ఉండాలి.. విభిన్నంగా ఉండాలి. అలాంటి విలన్ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను' అని ఈ మాస్ మహారాజా చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments