Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం (video)

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (12:49 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో వైవాహిక బంధాన్ని తెంచుకున్న తర్వాత హీరోయిన్ సమంత దశ తిరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన సినీ కెరీర్‌పై దృష్టిసారించిన  సమంత... వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలో తన పారితోషికాన్ని కూడా పెంచేశారు. 
 
ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. స్నేహితులతో కలిసి విదేశాలకు చక్కర్లు కొడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది సమంత. తాజాగా సామ్ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది.
 
ఈ నెల గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమానికి స్పీకర్‏గా వ్యవహరించే అవకాశాన్ని సమంత దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. దీంతో ఈ వేడుకలో స్పీకర్‏గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందింది. 
 
ఇక సమంతతోపాటు.. బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్, డైరెక్టర్ అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments