హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం (video)

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (12:49 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో వైవాహిక బంధాన్ని తెంచుకున్న తర్వాత హీరోయిన్ సమంత దశ తిరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన సినీ కెరీర్‌పై దృష్టిసారించిన  సమంత... వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలో తన పారితోషికాన్ని కూడా పెంచేశారు. 
 
ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. స్నేహితులతో కలిసి విదేశాలకు చక్కర్లు కొడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది సమంత. తాజాగా సామ్ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది.
 
ఈ నెల గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమానికి స్పీకర్‏గా వ్యవహరించే అవకాశాన్ని సమంత దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. దీంతో ఈ వేడుకలో స్పీకర్‏గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందింది. 
 
ఇక సమంతతోపాటు.. బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్, డైరెక్టర్ అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments