Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక వేధింపులు జరిగినప్పుడు చెప్పకపోవడం నేరమే... హీరో విశాల్

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (15:38 IST)
ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి నిర్మాతల వైపు నుండి ముగ్గురు సభ్యులున్న కమిటీని... బాధితుల తరపు నుండి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు హీరో విశాల్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఇప్పుడున్న సమస్యలే కాకుండా భవిష్యత్‌లో రాబోయే నటీనటులకు భరోసా ఇచ్చేలా పారదర్శక నిర్ణయాలను తీసుకుంటాం. ఇందులో కౌన్సిలింగ్‌ కూడా ఇస్తాం. 
 
ఏదైనా నేరం జరిగినప్పుడు ఏమీ మాట్లాడకపోవడం కూడా సెక్షన్‌ 201 ప్రకారం నేరమే. ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. ఉదాహరణకు అమలాపాల్‌ ఓ లైంగిక వేధింపుల సమస్యను ఫేస్‌ చేసినప్పుడు నాకు వెంటనే ఫోన్‌ చేసింది. నేను కూడా వెంటనే కార్తికి ఫోన్‌ చేసి .. సత్వర చర్యలు తీసుకున్నాం కాబట్టే ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయగలిగాం. బాధిత అమ్మాయి ధైర్యంగా ముందుకు రావాలి. అలా ముందుకు వస్తే మన పేరు పోతుంది.. ఏదో అయిపోతుందని భయపడకూడదు. 
 
ఎదుటి వ్యక్తుల నుండి రెస్పాన్స్‌ వచ్చినప్పుడే ఏదైనా సపోర్ట్‌ చేయగలం. మీటూ ఉద్యమాన్ని తప్పుగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు రేపు ఎవరైనా నా మీద కూడా ఆరోపణలు చేస్తే.. నేను సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది. కాబట్టి ఏదైనా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు కూడా ఉంటేనే మంచిది. ఎందుకంటే మీ టూని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం