Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలను ఎందుకు కనడం లేదంటే... హీరో వరుణ్ సందేశ్ భార్య వివరణ

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (15:11 IST)
హీరో వరుణ్ సందేశ్‌ వితికా షేరును గత 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరికి పిల్లలు లేరు. అయితే, 2018లో ఒకసారి వితికాకు గర్భస్రావం జరిగినట్టు ఆమె వెల్లడించింది. ఆ తర్వాత కూడా వారికి పిల్లలు లేకపోవడంతో పలు సందర్భాల్లో దీనిపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమకు పిల్లలు లేకపోవడంతో వితికా షేరు స్పందించారు. 
 
'పడ్డానండీ ప్రేమలో..' అనే చిత్రం ద్వారా వరుణ్ సందేశ్, తనకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా ఏర్పడింది. ఆ తర్వాత 2016లో మేమిద్దరం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యాం. అమెరికాలో స్థిరపడిపోదామని అక్కడకు వెళ్లాం. కొంతకాలం పాటు అక్కడే ఉన్నాం. 2018లో తాను గర్భందాల్చడంతో తమ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నట్టు చెప్పారు. కానీ, కొన్ని రోజులకే అబార్షన్ జరిగింది. అయితే, కొన్ని రోజుల పాటు తాము ఆ బాధలోనే ఉండిపోయామని చెప్పారు. 
 
బాధలోనే 'బిగ్ బాస్' షోలో పాల్గొన్నట్టు చెప్పారు. తనకు చిన్నపిల్లలంటే అమితమైన ఇష్టమని చెప్పారు. తాను ఎక్కడకు వెళ్లినా పిల్లలను ఎపుడు కంటారు అనే ప్రశ్న ఎదురవుతుందని, పిల్లల్ని కనకూడదని ఎవరైనా అనుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఆ మధుర క్షణం మరోమారు వస్తే ఖచ్చితంగా అందరితో పంచుకుంటానని వితికా షేరు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

ఉత్తరాఖండ్ గౌరీకుండ్‌లో కూలిపోయిన హెలికాప్టర్: ఏడుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments