Webdunia - Bharat's app for daily news and videos

Install App

60 రోజులు... రూ.90 కోట్లు : ప్రభాస్ యాక్షన్ ఘట్టం ఖర్చు...

యూనివర్శల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ దుబాయ్‌లో జరుపుకుంటోంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఘట్టం కోసం హాలీవుడ్ ఫైట్

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (15:42 IST)
యూనివర్శల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ దుబాయ్‌లో జరుపుకుంటోంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఘట్టం కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్లు పని చేస్తున్నారు. అయితే, ఈ ఫైట్ సన్నివేశాల కోసం ఏకంగా రూ.90 కోట్లను ఖర్చు చేస్తున్నారు. మొత్తం రెండు నెలల పాటు ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
 
ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా, దుబాయ్‌ రహదారుల్లో ప్రభాస్‌పై ఛేజింగ్‌ దృశ్యాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్‌ కోసం ఏకంగా 60 రోజులు కేటాయించారని తెలుస్తోంది. 'సినిమాలో చాలా కీలకమైన సన్నివేశంలో వచ్చే ఛేజింగ్‌ ఇది. అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్న ఆలోచనతో ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నాం' అని యూవీ క్రియేషన్స్‌కి చెందిన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 
 
కాగా, సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా నిర్మిస్తుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments