'రుద్రమదేవి' చిత్రం తర్వాత.. గుణశేఖర్ పేరే విన్పించలేదు. మీడియాకూ దూరంగా వున్నాడు. తన నిర్మాణ సంస్థలో నిర్మించిన ఆ సినిమాను తెలంగాణాలో టాక్స్ మినహాయింపుతో విడుదలచేసి సక్సెస్ అయ్యాడు. ఆంద్రాలో మాత్రం ఆ వెసులుబాటు లేకుండా పోయింది. ఏదిఏమైనా.. ఆ చిత్రం చాలా అనుభవాల్నే ఆయనకు నేర్పింది. బాహుబలి.. చిత్రానికి ముందుగానే రిలీజ్ అయితే.. రుద్రమదేవి బాగా ఆడేదని టాక్ మాత్రం సంపాదించుకున్నాడు.
కానీ లాభంలేదు. పెట్టిన పెట్టుబడి పెద్దగా రాకపోయినా.. పోటాపోటీతో బయటపడ్డాడు గుణశేఖర్.. ఆ చిత్రం మహిమో ఏమోకానీ.. ఆయనకు ప్రముఖ హీరోలెవ్వరూ డేట్స్ ఇవ్వడానికి ఇష్టపడడంలేదు. ఏదో సాకుతో ఆయన అపాయింట్మెంట్ వాయిదా వేస్తున్నారు. దీంతో విసిగిపోయినట్లు తెలిసింది. ఆయన గతంలో తను చెప్పినట్లు 'ప్రతాపరుద్రుడు' నిర్మించాల్సి వుంది.
అది ఇప్పటి పరిస్థితుల్లో వర్కవుట్ కాదనుకుని చిన్న సినిమా చేయాలని అనుకున్నట్లు సమాచారం. అందువలన ఈలోగా ఒక చిన్న సినిమా చేసి సక్సెస్ కొడితే.. హీరోల డేట్స్ వస్తాయనే ధీమాతో వున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో.