Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ సినిమాకు తెలంగాణ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (18:57 IST)
Radheshyam poster
ప్రభాస్ అభిమానుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌కటించింది. ఈరోజే ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.  రాధేశ్యామ్ ఈనెల 11న  అంటే రేపు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియాగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇటీవ‌లే ఆంధ్ర‌లో టికెట్ రేట్ల గురించి ప్ర‌భాస్ కూడా ఎ.పి. ప్ర‌భుత్వాన్ని క‌లిశారు. ఇక తెలంగాణాలో క‌ల‌వ‌కుండానే సినిమా ప‌రిశ్ర‌మ‌కు కె.సి.ఆర్‌. ప్ర‌భుత్వం ఆఫ‌ర్లు ఇస్తుంది.  ఈ సినిమా ఐదో ఆటకు అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.
 
ఈ విష‌యాన్ని నిర్మాతలు తెలిపారు. మార్చి 11 నుంచి మార్చి 25వ తేదీ వరకు రాధేశ్యామ్ సినిమాకు ఐదో షో ప్రదర్శించుకోవచ్చని ప్ర‌భుత్వ‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువీ క్రియేషన్స్ అధినేతలు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. జాత‌కాల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందింది. రేప‌టినుంచి ప్ర‌భాస్ జాత‌కం ఎలా మారుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments