Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ సినిమాకు తెలంగాణ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (18:57 IST)
Radheshyam poster
ప్రభాస్ అభిమానుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌కటించింది. ఈరోజే ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.  రాధేశ్యామ్ ఈనెల 11న  అంటే రేపు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియాగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇటీవ‌లే ఆంధ్ర‌లో టికెట్ రేట్ల గురించి ప్ర‌భాస్ కూడా ఎ.పి. ప్ర‌భుత్వాన్ని క‌లిశారు. ఇక తెలంగాణాలో క‌ల‌వ‌కుండానే సినిమా ప‌రిశ్ర‌మ‌కు కె.సి.ఆర్‌. ప్ర‌భుత్వం ఆఫ‌ర్లు ఇస్తుంది.  ఈ సినిమా ఐదో ఆటకు అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.
 
ఈ విష‌యాన్ని నిర్మాతలు తెలిపారు. మార్చి 11 నుంచి మార్చి 25వ తేదీ వరకు రాధేశ్యామ్ సినిమాకు ఐదో షో ప్రదర్శించుకోవచ్చని ప్ర‌భుత్వ‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువీ క్రియేషన్స్ అధినేతలు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. జాత‌కాల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందింది. రేప‌టినుంచి ప్ర‌భాస్ జాత‌కం ఎలా మారుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments