Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ కింగ్‌కు షాకిచ్చిన జీహెచ్ఎంసీ... రూ.లక్ష అపరాధం.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (11:38 IST)
టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తేరుకోలేని షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఎల్‌ఈడీ లైట్లతో కూడిన భారీ హోర్డింగ్‌ను ఇంటి బయట ఏర్పాటు చేసినందుకు గాను ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం చలాన్ జారీ చేసింది. 
 
ఎటువంటి ముందస్తు లిఖిత పూర్వక అనుమతి లేకుండా ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకుగాను ఈ అపరాధం విధిస్తున్నట్టు అందులో పేర్కొంది. ఇంటి ముందు ఏర్పాటు చేసిన అడ్వైర్‌టైజ్‌మెంట్ బోర్డు భవనం ఫ్రంటేజ్‌కు 15 శాతం మించిపోయిందని తెలిపింది.
 
పైగా, ముందస్తు అనుమతి లేకుండా ఇలాంటివి ఏర్పాటు చేయడం సంబంధిత సెక్షన్ల ప్రకారం నేరమని, కాబట్టి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు ఆ చలానాలో పేర్కొంది. దీనిపై మోహన్ బాబు ఇంకా స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments