బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులపై మరో కేసు

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (18:38 IST)
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాపై మరో కేసు నమోదైంది. అడల్ట్ కంటెంట్ కేసులో రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేయగా, ఆ తర్వాత ఆయన బెయిలుపై విడదలయ్యారు. తాజాగా ఈ జంటపై ఓ వ్యక్తి 1.51 కోట్ల చీటింగ్ కేసు పెట్టాడు. 
 
ముంబై, బాంద్రా పోలీస్ స్టేషన్‌లో పూణె యువకుడు యష్ బరాయ్ ఈ జంట తనను మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. వీళ్ళిద్దరితో పాటు ఫ్యాషన్ టీవీ ఎండీ కషీఫ్ ఖాన్‌పై కూడా పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
 
ఫిట్‌నెస్ స్కీమ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టమని కాషీఫ్ ఖాన్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాతో పాటు పలువురు తనను అడిగారని, భారీ లాభాలు వస్తాయని ఆశ చూపారని ఆ యువకుడు ఫిర్యాదులో తెలిపాడు. 
 
కానీ అందులో తనకు ఎలాంటి లాభాలు రాకపోవడంతో తన డబ్బు రూ.1.51 కోట్లు ఇచ్చేయాలంటూ అడిగితే బెదిరించారని చెప్పాడు. దీంతో యష్ బరాయ్ పోలీసులను ఆశ్రయించాడు. వీళ్లిద్దరి పై ఇలా చీటింగ్ కేసు బుక్ అవ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments