Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ మూవీ దృశ్యం దర్శకుడు ఇకలేరు...

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (17:28 IST)
బాలీవుడ్ చిత్రం దృశ్యంకు దర్శకత్వం వహించిన నిషికాంత్ కామత్ ఇకలేరు. ఆయన వయసు 50 యేళ్లు. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి కారణంగా ఆయన సోమవారం సాయంత్రం 4.24 గంటలకు చనిపోయినట్టు హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆస్పత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆయనను జూలై 31న ఆయను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఐసీయు వార్డుకు తరలించి చికిత్స చేయగా, ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడింది. కానీ, ఉన్నట్టుండి ఆదివారం నుంచి ఆయన ఆరోగ్యం విషమంగా మారగా, సోమవారం సాయంత్రం కన్నుమూసినట్టు ఏఐజీ ఆస్పత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, నిషికాంత్ బాలీవుడ్‌లో ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన 2005లో వచ్చిన 'డోంబీవాలీ ఫాస్ట్' అనే మరాఠీ సినిమా ద్వారా కెరీర్ ఆరంభించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు వరించింది. ఆ తర్వాత మలయాళంతో పాటు అనేక భాషల్లో హిట్టయిన "దృశ్యం" చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేశారు.
 
నిషికాంత్‌కు దర్శకత్వంలోనే కాదు నటనలోనూ ప్రవేశం ఉంది. ఆయన 'హవా ఆనే దే', 'రాకీ హ్యాండ్సమ్' అనే హిందీ చిత్రాలతో పాటు ఓ మరాఠీ సినిమాలోనూ నటించారు. నిషికాంత్ మరణం పట్ల బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. నిజానికి నిషికాంత్ కొన్ని రోజుల క్రితమే చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ సోమవారం ఉదయమే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఖండించారు కూడా. ఇంతలోనే నిషికాంత్ కామత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీపీఎస్సీ: అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం

భార్య గర్భవతి.. ఆరు రోజుల నవజాత కుక్కపిల్లల్ని దారుణంగా చంపిన భర్త.. సీసీటీవీలో? (video)

కేన్సర్ సోకిన భర్త .. భార్యకు చేసిన ప్రామీస్ గుర్తుకొచ్చింది... అర్థాంగిని చంపేసి తానుకూడా..

ఈడీని ఏర్పాటు చేసి తప్పు చేసిన కాంగ్రెస్.. ఇపుడు శిక్ష అనుభివిస్తోంది : అఖిలేష్ యాదవ్

తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే భద్రత కల్పించాలా? అలహాబాద్ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments