కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో డాన్ బోస్కో చిత్రీకరణ ప్రారంభం

దేవి
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (18:29 IST)
Rushya, Marna Menon
కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో "డాన్ బోస్కో" చిత్రం అధికారిక పూజా కార్యక్రమంతో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. పి.శంకర్ గౌరి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత నాగ వంశీ ముఖ్య అతిథిగా హాజరై.. ముహూర్తం షాట్‌కు నిర్మాత సాహు గారపాటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు. చిన్నబాబు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు.
 
ఈ సందర్భంగా మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయో పోస్టర్‌లో చూపించారు. పోలీస్ స్టేషన్‌లోని మోస్ట్ వాంటెడ్ బోర్డు ఇంట్రెస్టింగా ఉంది. ప్రిన్సిపాల్ విశ్వనాథ్‌గా మురళీ శర్మ  కీలక పాత్ర పోషిస్తున్నారు. లెక్చరర్ సుమతిగా మిర్నా మీనన్ నటిస్తున్నారు. మౌనిక, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, విష్ణు ఓయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
 
"డాన్ బోస్కో" అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. "వెల్‌కమ్ టు ది క్లాస్ రీయూనియన్-బ్యాచ్ 2014", "అన్ని రీయూనియన్లు జ్ఞాపకాల కోసం కాదు; కొన్ని విముక్తికి సంబంధించినవి" అంటూ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్‌ ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఎదురురోలు రాజు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.
 
SIIMA & AHA అవార్డులలో ఉత్తమ డెబ్యూటెంట్ ప్రొడక్షన్ హౌస్ అవార్డును అందుకున్న ఎమర్జింగ్ ప్రొడక్షన్ హౌస్ లౌక్య ఎంటర్టైన్మెంట్స్, శ్రీ మాయ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని, శైలేష్ రామ నిర్మిస్తున్న మూవీ "డాన్ బోస్కో". 
 
నటీనటులు: రుష్య, మర్నా మీనన్, మౌనిక, మురళీ శర్మ, విష్ణు ఓయ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments