Webdunia - Bharat's app for daily news and videos

Install App

#F2కి సీక్వెల్ రానుంది.. వెంకటేష్ ఏం చెప్పారంటే?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (11:18 IST)
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా గత ఏడాది సంక్రాంతికి వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఎఫ్2 భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. 
 
అంతకముందు మంచి కమర్షియల్ ఎంటెర్టైనర్లు చేసి ప్రేక్షకులను అలరించిన అనిల్ రావిపూడి, తొలిసారిగా ఈ సినిమాతో పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌ని తెరకెక్కించారు. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తాను అని అప్పట్లో దర్శకుడు అనిల్ చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలపై విక్టరీ వెంకటేష్ తాజాగా స్పందించారు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనులతో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్, ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై త్వరలో పనిచేయనున్నారని, అలానే ఈ సినిమాలో తనతో పాటు మరొక్కసారి వరుణ్ తేజ్ కూడా నటించబోతున్నట్లు వెంకీ చెప్పారు.
 
అయితే హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్ నటిస్తారా లేక వారి స్థానంలో మరొకరు ఉంటారా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం అని, అలానే ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కనున్నట్లు వెంకటేష్ వెల్లడించారు. ఇక ఈ వార్తతో వెంకీ, మెగా ఫ్యాన్స్ మరొక్కసారి పండగ చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments