Webdunia - Bharat's app for daily news and videos

Install App

#F2కి సీక్వెల్ రానుంది.. వెంకటేష్ ఏం చెప్పారంటే?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (11:18 IST)
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా గత ఏడాది సంక్రాంతికి వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఎఫ్2 భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. 
 
అంతకముందు మంచి కమర్షియల్ ఎంటెర్టైనర్లు చేసి ప్రేక్షకులను అలరించిన అనిల్ రావిపూడి, తొలిసారిగా ఈ సినిమాతో పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌ని తెరకెక్కించారు. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తాను అని అప్పట్లో దర్శకుడు అనిల్ చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలపై విక్టరీ వెంకటేష్ తాజాగా స్పందించారు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనులతో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్, ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై త్వరలో పనిచేయనున్నారని, అలానే ఈ సినిమాలో తనతో పాటు మరొక్కసారి వరుణ్ తేజ్ కూడా నటించబోతున్నట్లు వెంకీ చెప్పారు.
 
అయితే హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్ నటిస్తారా లేక వారి స్థానంలో మరొకరు ఉంటారా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం అని, అలానే ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కనున్నట్లు వెంకటేష్ వెల్లడించారు. ఇక ఈ వార్తతో వెంకీ, మెగా ఫ్యాన్స్ మరొక్కసారి పండగ చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments