Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్లువొచ్చి గోదారమ్మ...' లవ్‌ యూ అంటున్న పూజాహెగ్డే

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (13:16 IST)
మెగా ప్ర్రిన్స్ వరుణ్ తేజ్ - పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం "గద్దలకొండ గణేశ్". ఈ చిత్రం పేరు 'వాల్మీకి'. కానీ, విడుదలకు ఒక్క రోజు ముందు ఈ చిత్రం పేరు మారింది. అయితే, ఈచిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్‌కు ఆనందంలో ఉబ్బితబ్బిబ్బులైపోతోంది. 
 
ముఖ్యంగా, అప్పుడెప్పుడో 'దేవత' చిత్రం కోసం శోభన్ బాబు, శ్రీదేవిలపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తీసిన 'ఎల్లువొచ్చి గోదారమ్మ...' పాటను అదే స్టయిల్‌లో దర్శకుడు హరీశ్ శంకర్ రీమేక్ చేశాడు. ఇక దీనికి థియేటర్‌లో ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సినీ అభిమానులు ఈ పాట వచ్చినప్పుడు ఎగిరి గంతులేస్తున్నారు.
 
దీనిపై హీరోయిన్ పూజా హెగ్డే ఓ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పూజా హెగ్డే, "ఇందుకోసమే నేను మైళ్లకు మైళ్లు వెళుతుంటాను. ఇటువంటి దృశ్యాలు చూస్తే, బాధలన్నీ మరచిపోతాం. మీ ఆనందం, థియేటర్లలో ఇలా నృత్యం చేయడం చూసి, మేము నిద్రలేని రాత్రులను, ప్రయాణాన్ని, ఎండలో నిలబ‌డి సినిమాలు చేయ‌డాన్ని... వీటన్నింటినీ మీ ప్రేమ ముందు మ‌రిచిపోతాం. ఎల్లువొచ్చి గోదారామ్మ ల‌వ్ యూ" అని కామెంట్ పెట్టింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments