Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీపై పోటీ చేసిన మాజీ సైనికుడుకి ఈసీ నోటీసులు

Webdunia
బుధవారం, 1 మే 2019 (11:15 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీకి సమాజ్ వాదీ పార్టీ తరుపున బరిలోకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహుదూర్ సింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న జవానులకు సరైన ఆహరం అందడంలేదని, నాణ్యమైన భోజనం పెట్టడంలేదని బహుదూర్ సింగ్ ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలతో అధికారుల ఆగ్రహానికిగురై ఉద్యోగాన్ని కోల్పోయాడు.
 
అనంతరం ఎస్పీలో చేరడంతో ఆయనకు టికెట్ కేటాయించింది. నామినేషన్ సమయంలో తాను సర్వీసు నుంచి డిస్మిస్ అయినట్లు పేర్కొన్నాడు. కానీ తర్వాత సమర్పించిన పత్రాల్లో ఆయన ఆ విషయాన్ని పేర్కొనలేదు. ఈ లోపాలను గుర్తించిన ఈసీ ఆయనకు నోటీసులు ఇచ్చి, మే 1వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం అవినీతి, దేశద్రోహ ఆరోపణల మీద సర్వీసు నుంచి డిస్మిస్ అయిన వారు ఐదేళ్ల పాటు ప్రచారానికి అనర్హులు.
 
కాగా, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈయనపై కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ శర్మ పోటీ చేస్తుండగా, ఎస్పీ నుంచి తేజ్ బహుదూర్ సింగ్ పోటీ చేస్తున్నాడు. ఈయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments