Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్‌కు ఎందుకు వెళ్లలేదో వివరించిన "ఆర్ఆర్ఆర్" నిర్మాత!!

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (09:26 IST)
తన నిర్మాణ సారథ్యంలో వచ్చిన "ఆర్ఆర్ఆర్" చిత్రం చరిత్ర సృష్టించింది. ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఒక తెలుగు చిత్రంలోని ఓ పాటకు ఆస్కార్ రావడం చరిత్రలో ఇదే తొలిసారి. అయితే, ఈ ఆస్కార్ వేడుకల్లో చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మచ్చుకైనా కనిపించలేదు. దీనిపై అనేక రకాలైన ఊహాగానాలు వచ్చాయి. దర్శకుడు రాజమౌళికి, నిర్మాత దానయ్యకు ఎక్కడో చెడిందని అందుకే నిర్మాతను దర్శకుడు, చిత్ర బృందం సభ్యులు పట్టించుకోలేదనే ప్రచారం కూడా జరిగింది. 
 
పైగా, "నాటు నాటు" పాటకు ఆస్కార్ అవార్డు రావడం కోసం రాజమౌళి అండ్ కో ఏకంగా రూ.80 కోట్ల మేరకు ఖర్చు చేసి భారీగా లాబీయింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఆస్కార్‌కు వెళ్లకపోవడానికి కారణాలను నిర్మాత దానయ్య తాజాగా వెల్లడించారు. తన గురించి వచ్చిన అన్ని రకాల కథనాలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో రవ్వంత నిజం కూడా లేదని చెప్పారు. 
 
తాను తెరముందు కనిపించకపోయినా, వినిపిస్తే చాలు అని అనుకునే వ్యక్తినని స్పష్టం చేశారు. పబ్లిసిటీ అంటే తనకు నచ్చదని అందుకే ఆస్కార్‌కు వెళ్లలేదని చెప్పారు. ఇకపోతే, "ఆర్ఆర్ఆర్" చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా ఆర్థిక సాయం చేశారంటూ వస్తున్న వార్తలపై కూడా దానయ్య క్లారిటీ ఇచ్చారు. "ఆర్ఆర్ఆర్" చిత్ర నిర్మాణంలో ఏ ఒక్క హీరో భాగస్వామ్యం లేదని ఆయన స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments