లాక్డౌన్‌తో చుట్టుముట్టిన కష్టాలు - పండ్లు అమ్ముతున్న బాలీవుడ్ నటుడు

Webdunia
మంగళవారం, 26 మే 2020 (13:42 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఫలితంగా తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిలో కూలీల నుంచి సెలెబ్రిటీల వరకు ఉన్నారు. తాజాగా లాక్డౌన్ కారణంగా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఓ బాలీవుడ్ నటుడు పండ్ల వ్యాపారం ప్రారంభించాడు. అతని పేరు సోలంకి దివాకర్. ఈయన ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్‌లో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాలీవుడ్ నటుడు సోలంకి దివాకర్. ఈయన ఆయుష్మాన్ ఖురానా సినిమా 'డ్రీమ్‌గర్ల్'లో నటించి అలరించాడు. ఈ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన సోలంకి.. రిషికపూర్ చివరి సినిమా 'శర్మాజీ నంకిన్'లో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా మూడుసార్లు వాయిదా పడగా, ఆ తర్వాత రిషికపూర్ మృతి చెందడంతో సినిమా దాదాపు ఆగిపోయినట్టే లెక్క. 
 
ఇపుడు లాక్డౌన్ కారణంగా పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఢిల్లీ మార్కెట్లో పండ్లు అమ్ముకుంటూ కనిపించాడు. లాక్డౌన్ కారణంగా షూటింగులు లేక ఇంటి అద్దె కూడా కట్టలేకపోతున్నానని, నిత్యావసరాల కొనుగోలుకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు దివాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కెందుకు పండ్లు అమ్ముకుంటున్నట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments