Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్‌తో చుట్టుముట్టిన కష్టాలు - పండ్లు అమ్ముతున్న బాలీవుడ్ నటుడు

Webdunia
మంగళవారం, 26 మే 2020 (13:42 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఫలితంగా తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిలో కూలీల నుంచి సెలెబ్రిటీల వరకు ఉన్నారు. తాజాగా లాక్డౌన్ కారణంగా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఓ బాలీవుడ్ నటుడు పండ్ల వ్యాపారం ప్రారంభించాడు. అతని పేరు సోలంకి దివాకర్. ఈయన ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్‌లో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాలీవుడ్ నటుడు సోలంకి దివాకర్. ఈయన ఆయుష్మాన్ ఖురానా సినిమా 'డ్రీమ్‌గర్ల్'లో నటించి అలరించాడు. ఈ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన సోలంకి.. రిషికపూర్ చివరి సినిమా 'శర్మాజీ నంకిన్'లో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా మూడుసార్లు వాయిదా పడగా, ఆ తర్వాత రిషికపూర్ మృతి చెందడంతో సినిమా దాదాపు ఆగిపోయినట్టే లెక్క. 
 
ఇపుడు లాక్డౌన్ కారణంగా పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఢిల్లీ మార్కెట్లో పండ్లు అమ్ముకుంటూ కనిపించాడు. లాక్డౌన్ కారణంగా షూటింగులు లేక ఇంటి అద్దె కూడా కట్టలేకపోతున్నానని, నిత్యావసరాల కొనుగోలుకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు దివాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కెందుకు పండ్లు అమ్ముకుంటున్నట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ పర్యటించిన తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్.. జైలు నుంచి విడదలలో జాప్యం...

రూ. 300 కోసం పాట్నా రైల్వే స్టేషనులో విటుడికై మహిళ ఎదురుచూపు, తర్వాత ఏం జరిగింది? (video)

కోతికి గొడుగు అందించిన యువతి, గాల్లో తేలినట్టుందే (video)

కొన్నేళ్ల పాటు నిజాన్ని దాచిన భార్య... ఆ నిజం తెలిసి భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments