Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ - టాలీవుడ్‌లను పోల్చడం సరికాదు : రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (11:18 IST)
బాలీవుడ్, టాలీవుడ్ చిత్రపరిశ్రమలను ఒకదానితో ఒకటి పోల్చడం ఏమాత్రం భావ్యం కాదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ప్రేక్షకుల భావోద్వేగాల మీద సినిమా ఫలితం ఆధారపడివుంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి చిన్న విషయం వివాదాస్పదం అవుతుందని ఆమె వాపోయారు. 
 
గత కొన్ని రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఫలితంగా గత యేడాది ఏకంగా ఐదు హిందీ చిత్రాల్లో నటించింది. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్, టాలీవుడ్ చిత్రపరిశ్రమలను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై తాజాగా వివరణ ఇచ్చారు. 
 
సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని విమర్శించింది. హిందీ సినిమాలు, ప్రాంతీయ సినిమాలు రెండూ ఒక్కటేనని చెప్పారు. వాటిలో ఒకదానితో మరొకదాన్ని పోల్చరాదని అన్నారు. అన్నిటికన్నా ప్రేక్షకులే ముఖ్యమన్నారు. 
 
మంచి కథా చిత్రాలను ప్రేక్షకులు ఎల్లవేళలా ఆదరిస్తారని తెలిపారు. మన దేశంలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారని, వారు మన దేశ సినీ పరిశ్రమకు మంచి పేరు తెచ్చే సినిమాలను రూపొందించగలరని చెప్పారు. 
 
ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగిందని, సినిమా బాగుంటే థియేటర్‌లో ఓటీటీలో కూడా చూస్తారని తెలిపింది. ప్రేక్షకుల ఎమోషన్స్ మీదే సినిమాల ఫలితం ఆధారపడివుంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments