నా భార్య సౌందర్య గురించి తప్పుడు వార్తలు ప్రచురించకండి: భర్త రఘు

డీవీ
బుధవారం, 12 మార్చి 2025 (16:27 IST)
soundhrya, Husband Raghu
దివంగత నటి సౌందర్య ఆస్తి విషయంలో డా. మోహన్ బాబు మోసం చేశాడని పలు మాద్యమాలలో వార్తలు వచ్చాయి. దానిపై నేడు సౌందర్య భర్త జి.ఎస్.రఘు వివరణ ఇస్తూ ఓ లెటర్ ను విడుదలచేశారు. బెంగుళూర్ లో వుంటున్న జి.ఎస్.రఘు లిఖిత పూర్వకంగా తెలిపారు.
 
గత కొద్దిరోజులు హైదరాబాద్ లోని  సౌందర్య ఆస్తి గురించి మోహన్ బాబుకు లింక్ చేస్తూ వస్తున్న వార్తలనుబట్టి నేను స్పందిస్తున్నాను. ఆదారాలులేని నిరాధారమైన ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. అందుకే నా భార్య సౌందర్య ఆస్తి విషయంలో మోహన్ బాబుకు ఎటువంటి సంబంధంలేదని చెబుతున్నాను. నాకు తెలిసిన దాన్ని బట్టి మోహన్ బాబుకూ, సౌందర్యకు ఎటువంటి లాండ్ విషయంలో లావాదేవీలు జరగలేదు.
 
గత 25 సంవత్సరాలుగా మోహన్ బాబుగారితో సత్ సంబంధాలున్నాయి. నేను, నా భార్య, నా బావమరిది వారితో మంచి  రేపో వుంది. అందుకే అసలు నిజం ఏమిటో చెప్పాలని నేను మీడియాకు తెలియజేస్తున్నాను. కను మోహన్ బాబుతో ఎటువంటి లాండ్ వివాదం కానీ, లావాదేవీలు కానీ జరగలేదు. దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచురించకుండా చూడాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇకపై ఇటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని విన్నవించుకుంటున్నానని. రఘు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments