Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sai Pallavi-అనారోగ్యానికి గురైన సాయి పల్లవి -రెండు రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలట

సెల్వి
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (15:49 IST)
ప్రముఖ నటి సాయి పల్లవి అనారోగ్యానికి గురయ్యారని దర్శకుడు చందూ మొండేటి వెల్లడించారు. సాయి పల్లవి గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అలా ఉన్నప్పటికీ, ఆమె తండేల్ చిత్రం కోసం అనేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. దీని వలన ఆమె మరింత అలసటకు గురైందని తెలుస్తోంది.
 
సాయి పల్లవి కనీసం రెండు రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆమె అనారోగ్యం కారణంగా, ముంబైలో జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఆమె హాజరు కాలేకపోయింది. తండేల్ విషయానికొస్తే, ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు.

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో, ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments