Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బంటు' మాయలో పడిన బాలీవుడ్ భామ

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (10:15 IST)
అల్లు అర్జున్ నటించిన చిత్రం "అల.. వైకుంఠపురములో". త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించగా, నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబులు నిర్మించారు. 
 
అయితే, ఈ చిత్రంలోని ప్రతి పాటా సూపర్ హిట్టే. ముఖ్యంగా, 'సామజవరగమన', 'రాములో రాముల' పాటలు చిత్రం విడుదలకు ముందే హెద్ద హిట్. చిత్రం విడుదలైన తర్వాత 'బుట్టబొమ్మ' సాంగ్ అదిరిపోయింది. ఇది సోషల్ మీడియాలో ఓ ట్రెండ్‌ను సృష్టించిది. ఈ పాటకు అల్లు అర్జున్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. 
 
అందుకే సోష‌ల్ మీడియాలో ప‌లువురు ఈ పాట‌కు డాన్స్ చేసి పోస్ట్ చేయ‌డం విశేషం. శిల్పాశెట్టి వంటి బాలీవుడ్ తార కూడా ఈ పాట‌కు డాన్స్ చేయ‌డం అప్ప‌ట్లో సెన్సేష‌న్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ భామ దిశా ప‌టానీ కూడా బుట్ట బొమ్మ‌లో పాట‌కు ఫ్యాన్ అయ్యింది. 
 
ఈ పాటలో వాలు ఉప‌రిత‌లంపై జారుతూ బ‌న్నీ వేసే స్టెప్‌ను త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ 'అల్లు అర్జున్ ఇదెలా చేశావు' అని కామెంట్ పెట్టింది. దానికి అల్లు అర్జున్ స్పందింస్తూ "నేను మ్యూజిక్‌ను ప్రేమిస్తాను. మంచి మ్యూజిక్ నాతో డాన్స్ చేయిస్తుంది. మీ ప్ర‌శంస‌ల‌కు థాంక్స్" అంటూ బదిలిచ్చాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments