Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌తీష్ వేగేశ్నకి దిల్ రాజు హ్యాండ్ ఇచ్చాడా..?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (11:07 IST)
శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స‌తీష్ వేగేశ్న‌. క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్ స‌క్స‌ెస్ సాధించిన ఈ సినిమా జా తీయ స్ధాయిలో అవార్డుల‌ను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమా త‌ర్వాత వేగేశ్న స‌తీష్ యువ హీరో నితిన్‌తో శ్రీనివాస క‌ళ్యాణం తెర‌కెక్కించారు. 
 
అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు నిర్మించిన‌ ఈ మూవీ కూడా శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం వ‌లే ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది అనుకున్నారు కానీ..లెక్క త‌ప్పింది...సినిమా ఫ్లాప్ అయ్యింది. త‌ర్వాత ఇదే డైరెక్ట‌ర్‌తో థ్యాంక్యూ అనే సినిమా తీయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ఈ ప్రాజెక్ట్ ఏమైందో తెలియ‌దు.
 
ఇప్పుడు మ‌రో ఎమోష‌న‌ల్ డ్రామా తీసేందుకు స‌తీష్ వేగేశ్న రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ ఖ‌రారు చేసారు. ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మించ‌నుంద‌ని తెలిసింది. ఇటివలే ఖాకీ సినిమాను తెలుగులో విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతోంది. 
 
యంగ్ హీరో న‌టించే ఈ సినిమాకి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి..దిల్ రాజు స‌తీష్ వేగేశ్న‌తో నిర్మిస్తాన‌న్న థ్యాంక్యూ ఎందుకు ఆగిందో..? ఎందుకు హ్యాండ్ ఇవ్వాల్సి వ‌చ్చిందో..?

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments