Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ ఛాప్టర్ 2- ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. కళ్లు గిరగిరా తిరగడం..?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (23:27 IST)
కేజీఎఫ్ ఛాప్టర్ 2పై ప్రస్తుతం భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. దాంతో రెండో భాగం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు అభిమానులు. మధ్యలో కరోనా వచ్చింది కానీ లేదంటే మాత్రం గతేడాదే సినిమా విడుదలై ఉండేది. ఇంతకీ సంగతేంటంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఆకాశంలో ఉంది. 
 
నిర్మాతలు చెప్తున్న రేట్స్ విన్న తర్వాత బయ్యర్లకు వణుకు పుడుతుందని తెలుస్తుంది. కాస్త అతిగానే రేట్స్ కోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. తెలుగులో ఈ సినిమా రైట్స్ కోసం ఏఖంగా 70 కోట్లు కోట్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. తెలుగులో 70 కోట్లు అనేది చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు ఆ స్థాయిలో ఇక్కడ బిజినెస్ జరుగుతుంటుంది. 
 
టాలీవుడ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఇప్పుడు ఈ స్థాయి బిజినెస్ చేస్తున్నారు. అలాంటి రేట్ ఇప్పుడు కెజియఫ్ 2 కోసం చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. అయినా కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని సినిమాను 66 కోట్లకు దిల్ రాజు హక్కులను సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. తొలిభాగం కేవలం 5 కోట్లు మాత్రమే అమ్ముడైంది. అలాంటిది రెండో భాగం దాని కంటే 11 రెట్లు ఎక్కువ పలుకుతుంది. మరోవైపు కన్నడలో 100 కోట్లలో బిజినెస్ జరుగుతుంది.
 
ఇక తమిళంలో 30 కోట్ల వరకు జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఓవర్సీస్‌లో అయితే 80 కోట్ల వరకు కోట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా కేజీఎఫ్ ఛాప్టర్ 2 రూ.240 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కాగా జూలైలో కేజీఎఫ్ 2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments