Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్ నలుగురు హీరోలకు రెడ్ కార్డులు జారీ.. ఏం జరిగింది?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (19:43 IST)
Dhanush_Simbu_Vishal_Adarva
తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు స్టార్ హీరోలకు నిర్మాతల మండలి పెద్ద షాక్ ఇచ్చింది. నలుగురు హీరోలకు రెడ్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన నిర్మాతల మండలి సాధారణ సమావేశంలో స్టార్ హీరోలు ధనుష్, విశాల్, శింబు, అధర్వ మురళికి రెడ్ కార్డ్ జారీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.
 
2021లో నిర్మాత మైఖేల్ రాయప్పన్, శింబు మధ్య వివాదం తలెత్తింది. ఈ సినిమా కోసం 60 రోజుల డేట్స్ ఇచ్చిన శింబు కేవలం 27 రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నాడని, దాంతో తనకు భారీ నష్టం వాటిల్లిందని రెండేళ్ల క్రితం నిర్మాత మైఖేల్ రాయప్పన్ పోలీసులను ఆశ్రయించారు. రాయప్పన్ కంప్లయింట్ చేసిన నేపథ్యంలో శింబుకి రెడ్ కార్డ్ పడినట్లుగా సమాచారం.
 
అయితే ఇందులో భాగంగానే తమిళ స్టార్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు కూడా రెడ్ కార్డ్ పడింది అనేది మరో సంచలన విషయం. ఇది హాట్ టాపిక్‌గా మారింది. 
 
తేనాండాళ్‌ నిర్మాణ సంస్థలో ధనుష్‌ ఓ చిత్రాన్ని అంగీకరించారని, షూటింగ్‌ మొత్తం పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేశారని నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. 
 
దాంతో ధనుష్‌కి కూడా రెడ్ కార్డ్ పడబోతోందని తమిళనాట ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. వీరితో పాటు యువ హీరో అథర్వ మురళికి కూడా నిర్మాతల మండలి రెడ్ కార్డ్ జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments