Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్ నలుగురు హీరోలకు రెడ్ కార్డులు జారీ.. ఏం జరిగింది?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (19:43 IST)
Dhanush_Simbu_Vishal_Adarva
తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు స్టార్ హీరోలకు నిర్మాతల మండలి పెద్ద షాక్ ఇచ్చింది. నలుగురు హీరోలకు రెడ్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన నిర్మాతల మండలి సాధారణ సమావేశంలో స్టార్ హీరోలు ధనుష్, విశాల్, శింబు, అధర్వ మురళికి రెడ్ కార్డ్ జారీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.
 
2021లో నిర్మాత మైఖేల్ రాయప్పన్, శింబు మధ్య వివాదం తలెత్తింది. ఈ సినిమా కోసం 60 రోజుల డేట్స్ ఇచ్చిన శింబు కేవలం 27 రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నాడని, దాంతో తనకు భారీ నష్టం వాటిల్లిందని రెండేళ్ల క్రితం నిర్మాత మైఖేల్ రాయప్పన్ పోలీసులను ఆశ్రయించారు. రాయప్పన్ కంప్లయింట్ చేసిన నేపథ్యంలో శింబుకి రెడ్ కార్డ్ పడినట్లుగా సమాచారం.
 
అయితే ఇందులో భాగంగానే తమిళ స్టార్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు కూడా రెడ్ కార్డ్ పడింది అనేది మరో సంచలన విషయం. ఇది హాట్ టాపిక్‌గా మారింది. 
 
తేనాండాళ్‌ నిర్మాణ సంస్థలో ధనుష్‌ ఓ చిత్రాన్ని అంగీకరించారని, షూటింగ్‌ మొత్తం పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేశారని నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. 
 
దాంతో ధనుష్‌కి కూడా రెడ్ కార్డ్ పడబోతోందని తమిళనాట ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. వీరితో పాటు యువ హీరో అథర్వ మురళికి కూడా నిర్మాతల మండలి రెడ్ కార్డ్ జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమలలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి అయిన కారు (video)

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments