Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ధనుష్ అభిమానుల అతి చర్య.. థియేటర్ స్క్రీన్ చింపివేత

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (14:55 IST)
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ అభిమానులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తమ అభిమాన హీరో నటించిన చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ స్క్రీన్‌ను చింపివేశారు. ఈ ఘటన చెన్నై కోయంబేడులోని ఓ ప్రముఖ సినీ కాంప్లెక్స్ థియేటర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 18వ తేదీన ధనుష్ నటించిన "తిరుచిట్రాంబలం"(తెలుగులో "తిరు") చిత్రం విడుదలైంది. చాలాకాలం తర్వాత ధనుష్ నటించిన చిత్రం థియేటర్‌లో విడుదలైంది. దీంతో ఈ చిత్రం తొలి ఆటను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ థియేటర్ స్క్రీన్‌ను చింపివేశారు. 
 
పైగా, ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ ఆనందంతో ఈ పాడుపనికి పాల్పడ్డారు. కాగా, ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యామీనన్, రాశీఖన్నా, ప్రియా భవానీ శంకర్‌లు హీరోయిన్లుగా నటించగా, భారతీరాజా, ప్రకాష్ రాజ్‌లు కీలక పాత్రలను పోషించారు. మిత్రన్ ఆర్. జవహర్ దర్శకత్వం వహించగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు. సన్ పిక్చర్స్ బ్యానరులో నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments