Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ధనుష్ అభిమానుల అతి చర్య.. థియేటర్ స్క్రీన్ చింపివేత

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (14:55 IST)
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ అభిమానులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తమ అభిమాన హీరో నటించిన చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ స్క్రీన్‌ను చింపివేశారు. ఈ ఘటన చెన్నై కోయంబేడులోని ఓ ప్రముఖ సినీ కాంప్లెక్స్ థియేటర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 18వ తేదీన ధనుష్ నటించిన "తిరుచిట్రాంబలం"(తెలుగులో "తిరు") చిత్రం విడుదలైంది. చాలాకాలం తర్వాత ధనుష్ నటించిన చిత్రం థియేటర్‌లో విడుదలైంది. దీంతో ఈ చిత్రం తొలి ఆటను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ థియేటర్ స్క్రీన్‌ను చింపివేశారు. 
 
పైగా, ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ ఆనందంతో ఈ పాడుపనికి పాల్పడ్డారు. కాగా, ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యామీనన్, రాశీఖన్నా, ప్రియా భవానీ శంకర్‌లు హీరోయిన్లుగా నటించగా, భారతీరాజా, ప్రకాష్ రాజ్‌లు కీలక పాత్రలను పోషించారు. మిత్రన్ ఆర్. జవహర్ దర్శకత్వం వహించగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు. సన్ పిక్చర్స్ బ్యానరులో నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments