Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ధడక్'' ద్వారా శ్రీదేవి కుమార్తె ''జాహ్నవి'' తెరంగేట్రం..

అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెరంగేట్రానికి వేళైంది. మరాఠీలో హిట్టైన 'సైరత్' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'ధ‌డ‌క్' అనే సినిమాలో జాహ్నవి హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రా

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (14:08 IST)
అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెరంగేట్రానికి వేళైంది. మరాఠీలో హిట్టైన 'సైరత్' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'ధ‌డ‌క్' అనే సినిమాలో జాహ్నవి హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని జలై20వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేగాకుండా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 
 
శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అగ్రకులానికి చెందిన అమ్మాయి, నిమ్న కులానికి చెందిన అబ్బాయిల మధ్య కలిగిన ప్రేమ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగ్‌ను జరుపుతామని కరణ్ జోహార్ అన్నారు. జీ స్టూడియోస్, ధర్మా మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments