Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవీశ్రీ ప్రసాద్ ఖాతాలో అరుదైన రికార్డు

Webdunia
బుధవారం, 8 మే 2019 (14:45 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూర్య వంటి హీరోలకు ల్యాండ్ మార్క్‌ సినిమాలకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకుడుగా గుర్తింపు పొందాడు. ఇపుడు మహేష్ బాబు చిత్రానికి కూడా డీఎస్పీ సంగీతం సమకూర్చిన అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
టాలీవుడ్‌లో ఉన్న సంగీత దర్శకుల్లో దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. డీఎస్పీ సంగీతం అంటే మ్యూజికల్‌గా హిట్ కొట్టినట్టే. ప్రస్తుతం దేవిశ్రీ మహేష్ బాబు 25వ సినిమాకు సంగీత బాణీలు సమకూర్చాడు. మహర్షిలో సాంగ్స్ పెద్దగా లేవు అనుకున్న వాళ్లకు మహర్షి థీమ్ సాంగ్‌తో సమాధానం చెప్పాడు. "మహర్షి"కి సంగీతం అందిస్తున్న దేవీశ్రీ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. 
 
అదేమంటే.. సౌత్ స్టార్ హీరోల ల్యాండ్ మార్క్‌గా చెప్పుకునే సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించాడు. ఎన్టీఆర్ 25వ సినిమా 'నాన్నకు ప్రేమతో', కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 25వ సినిమా 'సింగం' అలానే మెగాస్టార్ 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ 25వ సినిమా 'మహర్షి'కి కూడా దేవిశ్రీ సంగీతం అందించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments