Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురుగదాసో, ఇంకో దాసో అంటారే తప్ప మన దాసుల పేర్లు చెప్పరేం : దాసరి సంచలన కామెంట్స్

దర్శకరత్న దాసరి నారాయణ రావు సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ భావదారిద్ర్యంలో మునిగిపోయిందంటూ ఘాటైన విమర్శలు చేశారు.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (11:09 IST)
దర్శకరత్న దాసరి నారాయణ రావు సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ భావదారిద్ర్యంలో మునిగిపోయిందంటూ ఘాటైన విమర్శలు చేశారు. 'పెళ్లిచూపులు' చిత్రం సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోల వైఖరిని తూర్పారబట్టారు. హీరోలకు ఈగో పెరిగిపోయిందంటూ మండిపడ్డారు.
 
అభిమాన దర్శకులు ఎవరని ప్రశ్నిస్తే, ఇక్కడ ఉన్న రాజమౌళి, రాఘవేంద్రరావు, విశ్వనాథ్‌ వంటి గొప్ప దర్శకుల పేర్లు చెప్పకుండా పరాయి భాషలకు చెందిన ఏ మురుగదాసో, ఇంకో దాసో అంటున్నారని, లేకుంటే హిందీవాళ్లు, ఇంగ్లీష్ వాళ్ల పేర్లు చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు.
 
తెలుగు ఇండస్ట్రీలో ఎందరో గొప్పవాళ్లున్నా వారి పేర్లు చెప్పేందుకు మనసు రావడం లేదని, ఇది ఒక్క తెలుగు పరిశ్రమకు మాత్రమే చుట్టుకున్న జబ్బని అన్నారు. పెద్ద సినిమాలను వేల థియేటర్లలో విడుదల చేస్తున్న నిర్మాతలపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. చాలా మందికి పిచ్చి పట్టిందని, తొలి రోజున 500, 1000 థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తే, నాలుగో రోజుకు ఎవరు చూస్తారని పశ్నించారు.

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments